AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: హౌస్‌ సర్జన్‌ అయి ఉండి ఇదేం పని.. జూనియర్స్‌ను రాత్రి కారిడార్‌లోకి తీసుకొచ్చి..

కాలేజీలు, యూనివర్సిటీల్లో ర్యాగింగ్‌ను ఆపాలని.. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ర్యాగింగ్ భూతాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు కూడా తీసుకువచ్చాయి. అయినా ఇప్పటికీ కొన్ని సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Kakinada: హౌస్‌ సర్జన్‌ అయి ఉండి ఇదేం పని.. జూనియర్స్‌ను రాత్రి కారిడార్‌లోకి తీసుకొచ్చి..
Rangaraya Medical College
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2024 | 7:17 PM

Share

ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ భూతం మళ్లీ పెచ్చుమీరుతోంది. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు, రాత్రి నిఘా పెట్టాల్సిన స్క్వాడ్లు నిస్తేజంగా మారాయి. దీంతో విద్యార్థులు వికృత చేష్టలకు అడ్రస్ అవుతున్నారు. జూనియర్‌ విద్యార్థులపై సీనియర్లు దాడులకు తెగబడుతున్నారు.

తాజాగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పీకలదాకా మద్యం తాగిన హౌస్‌ సర్జన్‌ జగదీశ్… జూనియర్లను ర్యాగింగ్ చేశాడు. కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నరకం చూపించాడు. ఎదురుతిరిగిన ముగ్గురిని కొట్టాడు. దీంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా విచారణ చేపట్టిన కళాశాల యాజమాన్యం.. జగదీశ్‌ని ఏడాదిపాటు సస్పెండ్‌ చేసింది.

కాలేజీల్లో యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్ గ్రూపులు, స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినా.. ఈ ర్యాగింగ్ మాత్రం ఆగడం లేదు. ఇదే ఇప్పుడు కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..