తీసుకున్న రుణం తీర్చమన్నందుకు యూఏఈని ఎగతాళి చేసిన పాకిస్తానీ సెనేటర్ హుస్సేన్
మింగను మెతుకు లేదు.. మీసాలకు మాత్రం సంపంగి నూనె అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. మండుతున్న పశ్చిమాసియాలో వేలు పెట్టి.. దౌత్యపరమైన కృషి చేస్తాం.. చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి రెడీ.. శాంతి వేదిక కడతాం రండి.. అని అగ్రరాజ్యానికి పిలుపునిచ్చింది పాకిస్తాన్. కానీ, తన వెనుక సలిపేస్తున్న నలుపును మాత్రం గుర్తించలేకపోతోంది. తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) డిమాండ్ చేసింది.

మింగను మెతుకు లేదు.. మీసాలకు మాత్రం సంపంగి నూనె అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. మండుతున్న పశ్చిమాసియాలో వేలు పెట్టి.. దౌత్యపరమైన కృషి చేస్తాం.. చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి రెడీ.. శాంతి వేదిక కడతాం రండి.. అని అగ్రరాజ్యానికి పిలుపునిచ్చింది పాకిస్తాన్. కానీ, తన వెనుక సలిపేస్తున్న నలుపును మాత్రం గుర్తించలేకపోతోంది. తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) డిమాండ్ చేసింది. దీంతో దిక్కుతోచని పాకిస్తాన్, అగ్ని మీద గుగ్గిలం అవుతోంది. యూఏఈకి లేనిపోని లింకులు పెడుతూ పిచ్చి ప్రేలాపనాలు చేస్తున్నా పాక్ ఎంపీలు.
తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) డిమాండ్ చేసిన వెంటనే, పాకిస్తానీ నాయకులు యూఏఈపై బహిరంగంగా విషం కక్కడం మొదలు పెట్టారు. ఒక పాకిస్తానీ సెనేటర్ యూఏఈని డబ్బు అవసరమైన ఒక పేద దేశం అని ఎగతాళి చేశారు. యూఏఈ రుణాన్ని తిరిగి చెల్లించాలన్న పాకిస్తానీ ప్రభుత్వ నిర్ణయం సరైన చర్య అని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీకి చెందిన సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ అన్నారు. న్యూఢిల్లీ అబుదాబిని బెదిరించిందని, ఏకీకృత భారతదేశంలో యూఏఈ భాగం కాగలదని హెచ్చరించిందని ఆయన అన్నారు.
పాకిస్తానీ టీవీ ఛానల్ ‘దునియా న్యూస్’లో ఒక కార్యక్రమంలో ఈ విషయంపై అడిగినప్పుడు, సెనేటర్ ముషాహిద్ హుస్సేన్, “యూఏఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని పాకిస్తానీ ప్రభుత్వం నిర్ణయించడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. యూఏఈని ఎద్దేవా చేస్తూ, హుస్సేన్, “యూఏఈలోని మన సోదరులు డబ్బు కోసం తీవ్రంగా అవసరంలో ఉన్నారు, కాబట్టి వారికి డబ్బు తిరిగి ఇవ్వడం పూర్తిగా సరైనది” అని అన్నారు. అంతేకాకుండా, ఆయన పాకిస్తాన్ను యూఏఈకి పెద్దన్న అని అభివర్ణించారు.
పాకిస్తాన్ సంవత్సరాల తరబడి యూఏఈకి రుణపడి ఉంది, కానీ ఆ సహాయాన్ని అంగీకరించకపోగా, పాకిస్తానీ సెనేటర్ యూఏఈపై అప్పును మోపారు. సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, “మేము ఎల్లప్పుడూ యూఏఈకి సహాయం చేశాము. ఆ దేశ నిర్మాణంలో పాకిస్తాన్ పాత్ర పోషించింది. వారి సైన్యానికి శిక్షణ ఇవ్వడంలో మేము పాలుపంచుకున్నాము” అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు యూఏఈ ఇచ్చిన విరాళం గురించి ప్రస్తావించినప్పుడు, ముషాహిద్ హుస్సేన్ తన ప్రకటనలో అసహనాన్ని వ్యక్తం చేశారు. “యూఏఈ ట్రంప్నకు 1.5 ట్రిలియన్ డాలర్లు ఇచ్చింది. వారు యెమెన్, సూడాన్లలో యుద్ధాలలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో, వారికి సహాయం చేయడం మన కర్తవ్యం.” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యూఏఈ జనాభా 10 మిలియన్లు, అందులో 4.3 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. మీరు భారతదేశంతో పెంచుకుంటున్న స్నేహం, ఏకీకృత భారతదేశానికి మిమ్మల్ని లక్ష్యంగా మార్చకుండా జాగ్రత్తపడండి.అంటూ ముషాహిద్ హుస్సేన్ ఎద్దేవా చేశారు.
[Such people are called “Namak Haram.”]
Senator Mushahid Hussain mocked the UAE on TV for asking Pakistan to repay its loans, even claiming Dubai “needs money because Iran ruined its economy.”
Despite the UAE giving Pakistan billions in aid and loans, this Namak Haram attitude… pic.twitter.com/0CZU91CP61
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) April 6, 2026
యూఏఈ, భారతదేశం మధ్య చీలిక తీసుకురావడానికి పాకిస్తాన్ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ ప్రయత్నించారు. యూఏఈని కూడా కలుపుకుని ఒకే భారతదేశం అనే ఆలోచనతో ఆయన అబుదాబిని బెదిరించారు. యూఏఈ జనాభాలో సగం మంది ఇప్పటికే భారతదేశానికి చెందినవారేనని హుస్సేన్ పేర్కొన్నారు. ఏకీకృత భారతదేశం దృష్టిలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా గల్ఫ్ దేశాలు కూడా ఉండవచ్చు అని ముషాహిద్ హుస్సేన్ అనుమానం వ్యక్తం చేశారు..
మరిన్న అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
