AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతిలో ఏనుగుల బీభత్సం, రైతుకు తీవ్ర గాయాలు

ఏపీలో చిత్తురు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు తరుచుగా జనవాసాల్లోకి వస్తూ స్థానికులను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడవుల్లో వాటికి కావాల్సిన సౌకర్యాలు లేకపోవడమో, వేటగాళ్ల సమస్యతోనో కానీ తరుచుగా జనాల్లోకి వస్తున్నాయి. ఈ కారణంగా చేతికొచ్చే పంటలు సైతం దెబ్బతింటున్నాయి.

తిరుపతిలో ఏనుగుల బీభత్సం, రైతుకు తీవ్ర గాయాలు
Elephant
Balu Jajala
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 15, 2024 | 11:02 AM

Share

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కండ్రిగ గ్రామంలో బుధవారం రాత్రి తన తోట వద్ద కాపలాగా ఉన్న రైతుకు అడవి ఏనుగుల గుంపు దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. రైతు మనోహర్ రెడ్డిని ఇతర రైతులు రక్షించారు. అటవీ శాఖాధికారులకు సమాచారం అందించి తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి సమీపంలో ఉన్న తన తోటలో రైతు ఉన్నాడు. అతని కుడి చేతికి ఫ్రాక్చర్ తో పాటు అనేక గాయాలయ్యాయి. రుయా ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.

చిన్న రామాపురం గ్రామపంచాయతీలోని యామలపల్లి, కొండ్రెడ్డి ఖండ్రిగలోని ఎక్కువగా పండ్లతోటలను లక్ష్యంగా చేసుకుని గత 20 రోజులుగా సుమారు 17 అడవి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నట్లు రైతులు తెలిపారు. గత 20 రోజులుగా జంబోల మంద ఆహారం,  నీటి కోసం జనావాసాల్లోకి వస్తూ అరటి, ఇతర తోటలు, రిజర్వు చేయబడిన అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న మానవ నివాసాలను లక్ష్యంగా చేసుకుంది. గ్రామస్తులు పండ్లతోటలను సందర్శించి వ్యవసాయం చేయలేకపోతున్నారని, అడవి ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపించాలని రైతులు అటవీ శాఖను కోరారు. “ఏనుగుల దాడి గురించి మేం భయపడుతున్నాము. మా గ్రామాలకు సమీపంలోని ప్రాంతాల్లో ఏనుగల మంద తరచుగా పర్యటిస్తోంది’’ అని యామనపల్లికి చెందిన ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. “నేను నా ఒక ఎకరం భూమిని పండ్లతోటను సాగు చేశాను. కానీ అది అడవి ఏనుగుల వల్ల దెబ్బతిన్నది” అని రైతులు చెబుతున్నారు.

కాగా ఏపీలో చిత్తురు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు తరుచుగా జనవాసాల్లోకి వస్తూ స్థానికులను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడవుల్లో వాటికి కావాల్సిన సౌకర్యాలు లేకపోవడమో, వేటగాళ్ల సమస్యతోనో కానీ తరుచుగా జనాల్లోకి వస్తున్నాయి. ఈ కారణంగా చేతికొచ్చే పంటలు సైతం దెబ్బతింటున్నాయి. రైతులు సైతం గాయాలపాలవుతున్నారు. అటవీ అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నా ఏనుగులు మాత్రం అటవీ ప్రాంతాలను దాటుకొని బయటకొస్తున్నాయి.

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు