AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట.. చివరికి.!

పొట్టకూటి కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కుటుంబాలు మాత్రం స్మశానంలోని చితాభస్మంలో స్వర్ణాన్వేషణ చేపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇంతకూ ఈ విధంగా జీవనం సాగించే తెగవారు ఎక్కడ ఉన్నారు..? వారు ఎంత కాలంగా ఇలా జీవిస్తున్నారు..?

AP News: స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట.. చివరికి.!
Graveyard
M Sivakumar
| Edited By: |

Updated on: Nov 20, 2024 | 5:12 PM

Share

మనిషి జీవించడానికి ఎన్నో రకాల పనులను చేస్తుంటాడు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన నైపుణ్యం కలిగి.. ఆయా రంగాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కుటుంబాలు మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే.. వారు స్మశానంలో స్వర్ణావేషణ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. దహనం చేసిన పార్ధీవదేహం నుంచి బంగారం తీసి.. దాన్ని అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. దీంతో అసలు దహనం చేసిన మృతదేహం నుంచి బంగారం ఎలా లభిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత స్మశానంలో దహన సంస్కారాలైన తర్వాత చితాభస్మంను చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం కుటుంబ సభ్యులు కాశీలో లేదా గంగలో కలుపుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారి నోటిలో కొంత బంగారాన్ని పెట్టి సాగనంపడం ఆనవాయితీగా వస్తోంది. మరికొందరు రేకు చనిపోయిన వారి నోట్లో పెడితే.. మరికొందరు వారు వాడిన ఉంగరాలు, దిద్దులు పెట్టి.. తమ ప్రేమ చాటుతుంటారు. ఇప్పటికే పలుచోట్ల ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని పలు కుటుంబాలు స్మశానంలోని చితాభస్మం నుంచి వచ్చే బంగారం తీసి.. విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో స్మశానం నుంచి తీసిన చితాభస్మంలో కొంత గంగలో కలపటానికి కుటుంబ సభ్యులు తీసుకోగా.. మిగిలిన చితాభస్మం నుంచి బంగారం తీసి, అ బంగారం మార్కెట్లో అమ్మి జీవనం సాగిస్తున్నాయి కొన్ని కుటుంబాలు. జగ్గయ్యపేట స్మశానం సమీపంలో జీవించే ఒక తెగవారు.. స్మశానంలో భస్మం చేసిన చితాభస్మంను పక్కనే ఉన్న పాలేటిలో కడిగి అందులో నుంచి బంగారం తీస్తారు. ఇలా వారు జీవనం సాగిస్తుండటంతో.. ఈ విషయం తెలిసి అందరు విస్తుపోతున్నారు.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే