అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అర్థరాత్రి స్కూటీపై స్వయంగా వెళ్లి గంజాయి స్థావరంపై 'మెరుపు దాడి' చేశారు. బృందావన గార్డెన్స్ లో ఆకతాయిల గంజాయి సేవనంపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఆమె వెంటనే స్పందించారు. పోలీసులకు ఆదేశాలిచ్చి, గస్తీ పెంచాలని సూచించారు. ప్రజా సమస్యల పట్ల ఆమె అంకితభావానికి, తక్షణ స్పందనకు ఇది నిదర్శనమని ప్రజలు ప్రశంసించారు. ఆమె సాహసం ప్రజల్లో విశ్వాసం పెంచింది.
ప్రజాప్రతినిధి అంటే కేవలం కార్యాలయాలకే పరిమితం కాదు, ప్రజల కష్టాల్లో వెన్నంటే ఉంటారని నిరూపించారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. అర్థరాత్రి సమయంలో సామాన్యురాలిలా స్కూటీపై వచ్చి ఆమె చేసిన ‘మెరుపు దాడి’ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని సంపన్న ప్రాంతమైన బృందావన గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో కొంతకాలంగా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అక్కడ గంజాయి సేవిస్తూ, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని స్థానిక మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫోన్ ద్వారా చేరవేశారు. ఎమ్మెల్యే వస్తారో రారో అని స్థానికులు అనుకుంటుండగానే.. ఫోన్ చేసిన పది నిమిషాలకే ఆమె స్వయంగా బండి నడుపుకుంటూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒంటరిగా స్కూటీపై దూసుకొచ్చిన ఎమ్మెల్యేను చూసి షాక్ తిన్న ఆకతాయిలు, అక్కడి నుండి పరుగులు తీశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆమె, ఆ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయాలని, గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కూడా ఆమె ఇలాగే పేకాట రాయుళ్ల స్థావరాలపై దాడులు చేసి వార్తల్లో నిలిచారు. “సమస్య ఏదైనా, సమయం ఏదైనా.. పిలవగానే స్పందించే నాయకురాలు” అంటూ బృందావన గార్డెన్స్ వాసులు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. సామాన్యుల భద్రత కోసం ఒక మహిళా ఎమ్మెల్యే అర్థరాత్రి పూట ఒంటరిగా రంగంలోకి దిగడం ఆమె అంకితభావానికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో పెద్దపులి.. వణుకుతున్న మన్యం
అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

