హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
APSRTC: అందులో ఎలాంటి వాస్తవం లేదు.. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ!
ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలకు ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. డిపోలు ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారం, ఉద్యోగాల కోతపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల అమలు, జీసీసీ విధానం, ఉద్యోగుల భద్రతపై కీలక వివరాలు వెల్లడించింది.
- M Sivakumar
- Updated on: Jul 9, 2026
- 6:18 pm
విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.200కే ఏసీ విశ్రాంతి సౌకర్యం!
విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక రైలు కోసం గంటల తరబడి ప్లాట్ఫామ్పై వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఆధునిక స్లీపింగ్ పాడ్స్ సేవలను ప్రారంభించారు. ప్లాట్ఫామ్ నంబర్-1లో ఏర్పాటు చేసి మొత్తం 168 స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి.
- M Sivakumar
- Updated on: Jul 8, 2026
- 11:24 am
Chicken Rates: కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.340-350 వరకు, డ్రెస్డ్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తుండగా, డజను గుడ్ల ధర రూ.90-100కు చేరింది. ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల, సరఫరా లోపం, పెరిగిన డిమాండ్ కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
- M Sivakumar
- Updated on: Jul 5, 2026
- 10:23 am
మూడు దశాబ్దాల ప్రజాసేవ చేసిన ఉద్యోగికి చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కలేదు..
మూడు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగి సిరా రామారావుకు మరణానంతరం చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కలేదు. అద్దె ఇంటి యజమాని భౌతికకాయాన్ని ఇంటి ముందు ఉంచేందుకు అనుమతించకపోవడంతో, రోడ్డుపైనే నివాళులర్పించి అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చిన ఘటన కంకిపాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.
- M Sivakumar
- Updated on: Jul 4, 2026
- 12:13 pm
Andhra Pradesh: కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం
ఏపీ టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిలో సోలార్ బోట్లను తీసుకొచ్చింది. డీజిల్ బోట్ల స్థానంలో వీటని కొత్తగా ప్రవేశపెట్టింది. దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి.
- M Sivakumar
- Updated on: Jul 3, 2026
- 6:09 pm
Srisailam: శ్రీశైలం వెళ్లేవారికి అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ..
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అడవిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది. దీంతో అటవీ ప్రాంతం గుండా శ్రీశైలం వెళ్లేవారు దీని గురించి తెలుసుకోవాల్సిందే..
- M Sivakumar
- Updated on: Jul 1, 2026
- 7:11 pm
Kankipadu: అమ్మ ప్రేమను గుర్తుకుచేసే రెస్టారెంట్.. అలనాటి మధుర జ్ఞాపకాలు ఎన్నో
ఒకప్పుడు కుటుంబ బంధాలకు చిరునామాగా నిలిచిన చేతిరాత ఉత్తరాలను మళ్లీ గుర్తు చేస్తోంది ఈ ప్రత్యేక రెస్టారెంట్. తల్లి తన కొడుక్కి రాసిన నిజమైన ఉత్తరాలను గోడలపై ప్రదర్శిస్తూ, పల్లె ఆత్మీయతను, అనుబంధాలను, మరుగున పడిన ఉత్తరాల సంస్కృతిని కొత్త తరానికి పరిచయం చేస్తోంది.
- M Sivakumar
- Updated on: Jun 26, 2026
- 1:06 pm
Andhra: బాబోయ్ యాసిడ్ పురుగులు.. మంటతోపాటు దురద.. ఒంటిపై వాలితే అలా అస్సలు చేయకండి..
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట, దురద, ఎర్రటి దద్దుర్లు, నీటి పొక్కులు వంటి సమస్యలు కలిగిస్తోంది. వర్షాకాలంలో తేమ పెరగడంతో వీటి సంచారం అధికమైందని నిపుణులు చెబుతున్నారు.
- M Sivakumar
- Updated on: Jun 24, 2026
- 5:38 pm
AP: పెద్దపులి సంచారం.. ఆ 11 గ్రామాలకు అలర్ట్ జారీ చేసిన అటవీ శాఖ!
పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలో పెద్దపులి సంచారం ఏలూరు జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పులి అడుగుజాడలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై చేపల వేట, బోట్లను నిలిపివేశారు. పులిని గుర్తించి తిరిగి అడవిలోకి తరలించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
- M Sivakumar
- Updated on: Jun 24, 2026
- 11:15 am
డబ్బా బ్రాండెడ్.. లోపల మాత్రం కల్తీ ఇంజన్ ఆయిల్.. ఇది తెలిస్తే వాహనదారుల గుండెల్లో గుబులే..
విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా నకిలీ ఇంజన్ ఆయిల్ దందా నడుస్తోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వాడిన ఇంజన్ ఆయిల్ను శుద్ధి చేసి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నకిలీ ఆయిల్ వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినడం, మైలేజ్ తగ్గడం, భారీ మరమ్మత్తుల ఖర్చులు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని మెకానిక్లు హెచ్చరిస్తున్నారు.
- M Sivakumar
- Updated on: Jun 12, 2026
- 6:05 pm
APSRTC : ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం.. జూన్ 11 నుంచి ఆందోళనల బాట..
ఏపీఎస్ఆర్టీసీలో సరికొత్త ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల భద్రతకే కాకుండా, ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఉనికికే ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. జూన్ 16 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
- M Sivakumar
- Updated on: Jun 8, 2026
- 5:05 pm
తిక్క కుదిరింది.. ట్రాఫిక్ డీసీపీపై సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు! వారిపై కేసు నమోదు
విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ప్రయాణికుల భద్రతపై అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల వీడియోపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
- M Sivakumar
- Updated on: Jun 7, 2026
- 11:18 am