హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
పర్యాటకులారా తస్మాత్ జాగ్రత్త.. మూలపాడు పార్కులోని జిప్ లైన్ ప్రాణాలకే ప్రమాదం?
NTR district butterfly park safety issues: ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక్క చిన్న తప్పు.. చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉందని పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. చిన్న సంఘటనగా మిగలదు. విషాదంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
- M Sivakumar
- Updated on: Mar 30, 2026
- 4:00 pm
Andhra News: కృష్ణమ్మ అలలపై అద్భుత దృశ్యం.. వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాధారణంగా రాజకీయ ర్యాలీలు రోడ్లపై జరుగుతాయి. కానీ ఏపీలో మాత్రం రాజకీయ ర్యాలీకి కృష్ణానది వేదికగా మారింది. అలల మధ్య సాగిన బోట్లపై పసుపు జెండాలు రెపరెపలాడుతుంటే. నదంతా ఒక రాజకీయ ఉత్సవంగా మారిపోయింది. తాడేపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇంత వినూత్నంగా, వైభవంగా జరగడం ప్రాంతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- M Sivakumar
- Updated on: Mar 29, 2026
- 4:27 pm
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక భక్తులకు ఇక్కట్లు!
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నా, తగిన వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాటేజీల కొరత వల్ల దర్శనం చేసుకుని వెంటనే వెనుదిరగాల్సి వస్తోంది. గత దశాబ్దంగా కాటేజీల నిర్మాణానికి అనేక ప్రతిపాదనలు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. భక్తుల సౌలభ్యం, ఆలయ ఆదాయం కోసం కాటేజీల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
- M Sivakumar
- Updated on: Mar 27, 2026
- 4:28 pm
మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్లో చిక్కుకోవద్దంటే ఇలా చేయండి
Vijayawada west bypass traffic changes: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త నిబంధనల ప్రకారం.. గుంటూరు వైపు నుంచి విజయవాడ, మంగళగిరి చేరాలనుకునే ప్రయాణికులు ముందుకు వెళ్లే అవకాశం లేకుండా కొత్త మార్పులు చేశారు. ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలు కదులుతున్నాయని అధికారులు తెలిపారు.
- M Sivakumar
- Updated on: Mar 26, 2026
- 5:37 pm
తక్కువ రేటుకు బంగారం వస్తుందంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు.. తీరా చూస్తే షాక్..!
తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామని మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకునే గ్యాంగ్ను గుణదల పోలీసులు ఛేదించారు. నకిలీ పోలీసుల వేషధారణలో బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురిని సోమవారం (మార్చి 23) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..
- M Sivakumar
- Updated on: Mar 24, 2026
- 8:50 am
AP News: ‘నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా’.. కేటుగాళ్ల కొత్త రకం మోసాలు
భక్తి విశ్వాసం.. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు ఆయుధాలుగా మారుతున్నాయి. స్వామీజీలమని చెప్పుకుంటూ ఇంటిలోకి అడుగుపెట్టి శాపం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన కృష్ణాజిల్లాలో కలకలం రేపుతోంది. ఇలాంటి కేటుగాళ్ల ఉచ్చులో పడొద్దంటూ పోలీసులు వారిస్తున్నా.. అమాయకులు మోసపోతూనే ఉన్నారు. అసలేం జరిగిందంటే..
- M Sivakumar
- Updated on: Mar 23, 2026
- 12:17 pm
వైభవంగా కనకదుర్గమ్మకు పుష్పార్చన.. ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారికి మందార, ఎర్ర కలువలు, చామంతి పూలతో అత్యంత శోభాయమానంగా పుష్పార్చన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి స్వయంగా పూజలు చేయగా, వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిరోజూ విభిన్న పుష్పాలతో అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తున్నాయి, ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది.
- M Sivakumar
- Updated on: Mar 23, 2026
- 11:51 am
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్గా.. ఈ యువకుడి మోసాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఓఎల్ఎక్స్ లో కార్ల కొనుగోలు విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసుల అరెస్టు చేశారు. కార్ డీలర్ గా మరోసారి కారు యజమానిగా నటిస్తూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు దోచుకున్న నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- M Sivakumar
- Updated on: Mar 6, 2026
- 10:12 pm
అమరావతిలో హైకోర్టు జస్టిస్ బంగ్లాలు ప్రారంభం.. ఆకట్టుకునేలా న్యాయమూర్తుల నివాస సముదాయాలు
ఒకప్పుడు ఇదంతా గ్రాఫిక్స్ మాత్రమే.. అమరావతిలో ఏమి లేదు.. అంటూ విమర్శలు వచ్చిన రాజధాని ప్రాంతం ఇది. ఇప్పుడు మాత్రం అదే విమర్శలకు నిజమైన నిర్మాణాలతో సమాధానం చెబుతోంది. అమరావతి రాజధానిలో జస్టిస్ సిటీలో నిర్మించిన జస్టిస్ బంగ్లాలు తాజాగా ప్రారంభం కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..
- M Sivakumar
- Updated on: Mar 2, 2026
- 5:10 pm
Andhra Pradesh: బంగారం రేంజ్కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మామిడి సీజన్ ఇంకా గుమ్మం తట్టకముందే.. మార్కెట్లో మాత్రం రికార్డు స్థాయిలో రేట్లు హడావిడి మొదలైంది. తోటల్లో కోతలు పూర్తిగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కవర్లు కట్టిన బంగినపల్లి, తోతాపూరి రకానికి ఈసారి గోల్డ్ రేంజ్ ధరలు పలుకుతున్నాయి. ఒక టన్ను ధర వింటేనే ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి. చిన్న కవర్ కట్టిన కాయ పెద్ద లాభం తెచ్చిపెట్టుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది.
- M Sivakumar
- Updated on: Feb 25, 2026
- 6:43 pm
లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. రోడ్డున పడ్డ సెక్యూరిటీ గార్డ్ కుటుంబం..!
ఇంటి అద్దె.. పిల్లల చదువులు.. రోజువారీ ఖర్చులు.. ఇలా జీవితంతో పోరాడుతూ కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఓ సాధారణ సెక్యూరిటీ గార్డు, కొన్ని వేల రూపాయల కోసం తీసుకున్న లోన్.. చివరికి అతను ప్రాణాన్నే తీసుకుంది. కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయవిదారకర ఘటన అందరినీ కలచివేసింది.
- M Sivakumar
- Updated on: Feb 21, 2026
- 5:14 pm
Andhra: ఇన్ స్టాలో పరిచయమైన ధనవంతుడి కోసం ఏపీకి వచ్చిన జార్ఖండ్ వివాహిత.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
పెళ్లై, ముగ్గరు పిల్లలున్నారు.. కానీ ఆమె దారి తప్పింది... విలాసవంతమైన జీవితం కోరుకుందో.. కొత్త జీవితం కోసం ఆరాటపడిందో తెలియదు కానీ.. ఇన్స్టాగ్రామ్లో కొత్త ప్రేమికుడ్ని వెతుక్కుంది. అతగాడి కోసం ఝార్ఖండ్ నుంచి ఆంధ్రా చేరుకుంది.. ఆపై అసలు ట్విస్ట్.. ..
- M Sivakumar
- Updated on: Feb 18, 2026
- 4:25 pm