AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Sivakumar

M Sivakumar

Reporter - TV9 Telugu

siva.medandraravu@tv9.com

హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..

Read More
Electric Buses: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆర్టీసీలో ప్రయాణం మరింత సౌకర్యవంతం

Electric Buses: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆర్టీసీలో ప్రయాణం మరింత సౌకర్యవంతం

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇదో గుడ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత సులభతరం కాబోతుంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ కింద ఏపీకి కొత్తగా 750 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనితో రాష్ట్రంలో ప్రయాణికులు రద్దీలేని ప్రయాణాన్ని సాగించవచ్చు.

AP LEAP School: ఏపీలో సరికొత్త లీప్ స్కూల్.. దీని స్పెషాలిటీ ఏంటో చూడండి..

AP LEAP School: ఏపీలో సరికొత్త లీప్ స్కూల్.. దీని స్పెషాలిటీ ఏంటో చూడండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త విప్లవం.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీలో తొలి లీప్ పాఠశాల సిద్ధమైంది. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో రూ.16 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక పాఠశాలను నిర్మించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అందుబాటులోకి రానున్న ఈ స్కూల్ విశేషాలు చూడండి..

సమ్మర్‌లో కోళ్ల మరణానికి కారణం ఇదేనట.. చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

సమ్మర్‌లో కోళ్ల మరణానికి కారణం ఇదేనట.. చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న ఎండల తీవ్రత ఇప్పుడు పౌల్ట్రీ రంగానికీ పెద్ద దెబ్బగా మారింది. గడిచిన మూడు రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాన్ని కొంత మేరైనా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సమ్మర్‌లో సేఫ్‌గా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

బెజవాడలో మళ్లీ కాల్ మనీ..! ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటే.. ఇక అంతే..

బెజవాడలో మళ్లీ కాల్ మనీ..! ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటే.. ఇక అంతే..

ఒకప్పుడు కాల్ మనీ అనే పదం వినగానే ప్రజలు వణికిపోయేవారు. అప్పు తీసుకుంటే వడ్డీ భారంతోనే బాధపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారింది. వడ్డీ వ్యాపారం పేరుతో ప్రారంభమైన వ్యవహారం, చివరకు బ్లాక్ మెయిల్‌గా మారి వ్యాపారులను, మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్న ఆరోపణలు బెజవాడలో సంచలనం రేపుతున్నాయి.

బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ ఎంపిక..!

బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ ఎంపిక..!

Jyothi Surekha Vennam: ఆసియా క్రీడల వేదికపై మరోసారి తెలుగు అమ్మాయి గురి పెట్టింది. అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న స్టార్ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం 2026 ఆసియా క్రీడలకు ఎంపికైంది. ఇప్పటికే మూడు ఆసియా క్రీడల్లో దేశానికి పతకాల వర్షం కురిపించిన జ్యోతి.. ఇప్పుడు వరుసగా నాలుగోసారి భారత జట్టులో చోటు దక్కించుకుని తన స్థిరమైన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది.

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ కోటా..

Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..!

Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..!

Traffic Rules: ఇకపై కేవలం ఫైన్లకే పరిమితం కాకుండా.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాహనం సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల ద్వారా రాంగ్‌రూట్ డ్రైవింగ్‌ను గుర్తిస్తున్న పోలీసులు. ఇక ఫీల్డ్‌లో

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

Vijayawada Kanaka Durga temple: తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడిని హైటెక్ సేవలకు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలో త్వరలో AI సేవలు అందుబాటులోకి రానున్నాయి. భక్తులకు దర్శనం మరింత సులభంగా కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రద్దీని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు.

ఉదయాన్నే కార్లల్లో దిగారు.. ఎవరూ లేని చోట గుట్టుచప్పుడు కాకుండా పని స్టార్ట్ చేశారు.. కట్ చేస్తే..

ఉదయాన్నే కార్లల్లో దిగారు.. ఎవరూ లేని చోట గుట్టుచప్పుడు కాకుండా పని స్టార్ట్ చేశారు.. కట్ చేస్తే..

సినిమాల్లో మాత్రమే చూసే గుప్తనిధుల వేట ఇప్పుడు కృష్ణాజిల్లాలో కలకలం రేపింది. కంకిపాడు మండలం పునాదిపాడులోని ఓ పురాతన ఇంటిలో కొందరు వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు చేపట్టడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఖరీదైన కార్లలో వచ్చిన వారు ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలతో భూమిని పరిశీలిస్తూ తవ్వకాలు జరిపినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. విషయం బయటపడటంతో వారు కార్లు, పరికరాలు అక్కడే వదిలేసి పరారయ్యారు.

Mangoes: ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు..

Mangoes: ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు..

వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో కనిపిస్తున్న మెరిసే మామిడిపండ్ల వెనుక ప్రమాదకర నిజాలు బయటపడుతున్నాయి. కృష్ణాజిల్లాలో రసాయనాలతో గంటల్లోనే మగ్గించిన మామిడిపండ్లు భారీగా విక్రయిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఆరోగ్యానికి హానికరమైన కెమికల్స్‌తో పండ్లను మగ్గపెట్టి మార్కెట్‌లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ATS వర్సెస్ మాన్యువల్ తనిఖీలు.. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై కొత్త సందిగ్ధత!

ATS వర్సెస్ మాన్యువల్ తనిఖీలు.. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై కొత్త సందిగ్ధత!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థల పునఃప్రారంభం కానున్న తరుణంలో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈసారి తనిఖీ విధానం రవాణా రంగంలో మరియు విద్యాసంస్థల యాజమాన్యాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) ఉండగా, అధికారులు మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చి బస్సులను తనిఖీ చేయాల్సిన అవసరం ఏముందనేది ఇప్పుడు అసలు ప్రశ్న.

Andhra Pradesh: ఫ్యూచర్ రెడీ సంకల్పంలో కీలక ఘట్టం.. సింగపూర్ పర్యటనలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

Andhra Pradesh: ఫ్యూచర్ రెడీ సంకల్పంలో కీలక ఘట్టం.. సింగపూర్ పర్యటనలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ రెడీ సంకల్పం దిశగా ఏపీ ఉపాధ్యాయులు అడుగులు వేస్తున్నారు. కేవలం తరగతి గదులకే పరిమితంకాకుండా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను అందిపుచ్చుకునేందుకు 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనలో ఉంది..