హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
Andhra: ఇన్ స్టాలో పరిచయమైన ధనవంతుడి కోసం ఏపీకి వచ్చిన జార్ఖండ్ వివాహిత.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
పెళ్లై, ముగ్గరు పిల్లలున్నారు.. కానీ ఆమె దారి తప్పింది... విలాసవంతమైన జీవితం కోరుకుందో.. కొత్త జీవితం కోసం ఆరాటపడిందో తెలియదు కానీ.. ఇన్స్టాగ్రామ్లో కొత్త ప్రేమికుడ్ని వెతుక్కుంది. అతగాడి కోసం ఝార్ఖండ్ నుంచి ఆంధ్రా చేరుకుంది.. ఆపై అసలు ట్విస్ట్.. ..
- M Sivakumar
- Updated on: Feb 18, 2026
- 4:25 pm
Andhra: బస్సులోనే ఎంతకు తెగించార్రా.. పక్క పక్కనే స్లీపర్ సీట్స్ బుక్ చేసుకున్న లవర్స్.. ఆ తర్వాత..
ఇద్దరూ లవర్స్.. హైదరాబాద్లో ఉంటున్నారు.. అయితే.. మచిలీపట్నం వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో స్లీపర్ సీట్లు బుక్ చేసుకున్నారు. ఇద్దరివీ పక్కపక్కనే సీట్లు.. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే.. పక్క పక్కనే సీట్లు కానీ.. అమ్మాయి.. అబ్బాయి పేర్లు ఉండాలి.. కానీ..
- M Sivakumar
- Updated on: Feb 16, 2026
- 5:38 pm
ప్రకాశం బ్యారేజ్ వద్ద కలకలం.. పోలీసుల అప్రమత్తతతో ముగ్గురు ప్రాణాలను సేఫ్..!
ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే.. మూడు ప్రాణాలు కృష్ణా జలాల్లో కలిసిపోయేవి. కానీ సమయానికి స్పందించిన బెజవాడ పోలీసులు ఆ విషాదాన్ని అడ్డుకుని ఒక కుటుంబాన్ని మళ్లీ జీవితానికి చేర్చారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- M Sivakumar
- Updated on: Feb 14, 2026
- 10:26 am
KGBVలో అమానుషం.. అర్ధరాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలపై ఎలుకల దాడి! ఆ తర్వాత..
అర్ధరాత్రి నిశ్శబ్దం.. హాస్టల్లో గాఢ నిద్రలో ఉన్న చిన్నారులు. ఉన్నట్లుండి ఒక్కసారిగా కేకలు, అరుపులు భయంతో ఏడుపులు.. ఏమైందో అర్థం కాక ఉపాధ్యాయులు పరిగెత్తుకుంటూ వెళ్లేలోపే దారుణం జరిగింది. ఎలుకల దాడితో బాలికలు గాయపడి ఏడుపు లంకించుకున్నారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా కలకలం రేపుతోంది..
- M Sivakumar
- Updated on: Feb 13, 2026
- 12:40 pm
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఆంబోతులు.. మూగ జీవాలకు ప్రాణ భిక్ష పెట్టిన ట్రాఫిక్ పోలీసులు
మనుషుల మధ్య మానవత్వం మసకబారుతున్న ఈరోజుల్లో.. మాట్లాడలేని మూగజీవాల ప్రాణాల కోసం పరుగులెత్తాయి కొన్ని చేతులు..! విజయవాడలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాయి. డ్రైనేజీ కాలవలో చిక్కుకున్న రెండు !ఎద్దులను ట్రాఫిక్ పోలీసులు, విఎంసీ సిబ్బంది క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. ఇప్పుడు విజయవాడ ట్రాఫిక్ పోలీసుల సమయస్పూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
- M Sivakumar
- Updated on: Feb 11, 2026
- 12:06 pm
NTR District: ఎన్టీఆర్ జిల్లాలో నాన్న పాడే మోసిన కుమార్తెలు..
సమాజంలో ఇప్పటికీ “కుమారుడు ఉంటేనే తండ్రికి అంతిమ సంస్కారాలు జరుగుతాయి” అనే పాత ఆలోచన బలంగా ఉంది. కానీ ఆ మాటలన్నింటికీ గట్టి సమాధానం చెప్పారు… ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన నలుగురు కుమార్తెలు. .. ..
- M Sivakumar
- Updated on: Feb 9, 2026
- 12:32 pm
Vijayawada: “పోయిన బైక్ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?”
బైక్ పోయిందని ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోలేదు. కొత్త బైక్ కొంటే ఫైన్లు రాస్తున్నారు. ఈ అన్యాయంపై ఓ యువకుడు విజయవాడ సీపీ ఆఫీస్ ఎదుటే వినూత్న నిరసన చేపట్టాడు. ఇప్పుడు ఆ సంఘటన నగరంలో చర్చనియాంశమైంది. పూర్తి వివరాలు కథనంలో ...
- M Sivakumar
- Updated on: Feb 8, 2026
- 12:19 pm
Vijayawada: వాహనదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ బైపాస్..
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం దక్కింది. గోల్లపూడి నుంచి వస్తున్న వాహనాలు ఫిబ్రవరి 10 నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా చిన్న కాకాని హాయిలాండ్ చేరేందుకు అనుమతి లభించింది. ప్రారంభ దశలో కేవలం కార్లు, ద్విచక్ర వాహనాలకు పర్మిషన్ ఇచ్చారు.
- M Sivakumar
- Updated on: Feb 8, 2026
- 10:35 am
Andhra Pradesh: లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. మరో రెండేళ్లు వేచిచూడాల్సిందేనా..?
గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసే లోకల్ బాడీ ఎన్నికలు ఈసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యంలో కీలకంగా ఉండే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వందలాది ఆశావహులకు ఇది పెద్ద నిరాశగా మారింది. ఈ క్షణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
- M Sivakumar
- Updated on: Feb 7, 2026
- 6:09 pm
మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన 39 ప్రాణాలు..!
ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆ క్షణంలో డ్రైవర్ తీసుకున్న ఒక నిర్ణయం 39 కుటుంబాలలో దీపాలు ఆరిపోకుండా కాపాడింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి బస్సు పక్కకు ఆపి ప్రయాణికులను సురక్షితంగా డ్రైవర్ దింపాడు. కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది..
- M Sivakumar
- Updated on: Feb 7, 2026
- 4:09 pm
Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..
విజయవాడలో సినిమా స్టైల్లో జరిగిన మోసం సంచలనంగా మారింది. ఫేస్బుక్లో గోల్డ్ ట్రైనింగ్ కంపెనీ యాడ్ చూసి బంగారం విడిపిస్తానంటూ సంప్రదించిన ఓ సివిల్ కాంట్రాక్టర్, నమ్మకం కల్పించి రూ.10.50 లక్షలు ఖాతాలో వేయించుకొని కళ్లుకప్పి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకుని రూ.10.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
- M Sivakumar
- Updated on: Feb 7, 2026
- 12:08 pm
Andhra News: భద్రం గురూ.. ఆకలి మీద ఉన్న పెద్ద పులి.. అప్రమత్తం లేకుంటే అంతే ఇక..
గత వారం రోజులుగా జిల్లాలో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పులిని పట్టుకునేందుకు అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులు నిరంతర నిఘాను కొనసాగిస్తున్నారు. రెండు ప్రత్యేక వాహనాలలో ఐదుగురు నిపుణులు రాజమండ్రి చేరుకొని స్థానిక అటవీశాఖ అధికారులతో సమన్వయంగా రెస్క్యూ ప్రారంభించారు.
- M Sivakumar
- Updated on: Feb 6, 2026
- 11:38 am