హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
గణపయ్య భక్తులకు ప్రభుత్వం సూపర్ గుడ్న్యూస్.. వినాయక మండపాలకు ఉచిత కరెంట్!
రాష్ట్రంలో వినాయక మండపాలు ఏర్పాటు చేయబోయే నిర్వాహకులు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాల కోసం తాత్కాలిక కనెన్షన్లతో పాటు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే అక్రమంగా కనెక్షన్లు తీసుకునే వారిపై చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది.
- M Sivakumar
- Updated on: Sep 9, 2026
- 11:44 am
‘మరణానికి అనుమతి ఇవ్వండి’ అంటూ.. 74 ఏళ్ల వృద్ధుడి కన్నీటి లేఖ..!
74 ఏళ్ల మాజీ ఉద్యోగి రాజన్బాబు కన్నీటి గాథ. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం, నకిలీ కుల ధ్రువీకరణ పత్రంపై ఆరోపణలతో ఆయన న్యాయం కోసం పోరాడుతున్నారు. అంతులేని పోరాటంతో విసిగిపోయి, ప్రాణం తీసుకునేందుకు అనుమతివ్వమని అధికారులను వేడుకుంటున్నారు. ఆస్తి ఎవరిది అనేది చట్టం తేల్చాల్సిందే.. ఆరోపణలు నిజమా కాదా అనేది విచారణలో బయటపడాల్సిందే.
- M Sivakumar
- Updated on: Sep 7, 2026
- 6:17 pm
అక్టోబరు 11 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు..10 రోజుల పాటు అమ్మవారి దివ్య రూపాల దర్శనం!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 దసరా మహోత్సవాల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అక్టోబర్ 20న విజయదశమి వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 16న మూలా నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సరస్వతి దేవి అలంకారం, అక్టోబర్ 20న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. విజయదశమి సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనం తెప్పోత్సవంతో ఈ దసరా ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయి.
- M Sivakumar
- Updated on: Sep 3, 2026
- 12:14 pm
చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదా? .. దానికి కోటింగ్ వేసి..
చెర్రీలా కనిపిస్తున్న కొన్ని పండ్లపై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాక్కాయను ప్రాసెస్ చేసి, ఎరుపు రంగు, కోటింగ్ వేసి చెర్రీలా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ల్యాబ్ పరీక్షలు లేకుండా ఇవి నకిలీ చెర్రీలని నిర్ధారించలేం. అనుమానాస్పద పండ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.
- M Sivakumar
- Updated on: Sep 2, 2026
- 5:35 pm
Disneyland: పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్! ఎప్పటి నుంచంటే?
ఒకప్పుడు పిల్లల కేరింతలు, అడ్వెంచర్ క్రీడలు, రివర్ ఫ్రంట్ సందడితో కళకళలాడిన విజయవాడ డిస్నీల్యాండ్ మళ్లీ తెరుచుకోనుందా? 57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సిబార్ సంస్థతో జరుగుతున్న చర్చల పర్యవసానం ఏమిటి? ప్రస్తుతం ఈ అంశమే విజయవాడలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
- M Sivakumar
- Updated on: Aug 27, 2026
- 4:59 pm
కంటే కూతుర్నే కనాలి..! కొడుకులు లేరని ఆ తండ్రికి చివరి వీడ్కోలు ఆగిపోలేదు.. ఓ కన్నీటి గాధ..
కృష్ణా జిల్లా పామర్రులో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. 65 ఏళ్ల పలగాని వెంకటనారాయణ గుండెపోటుతో మృతి చెందగా.. ఆయనకు ముగ్గురు కుమార్తెలు చివరి వీడ్కోలు పలికారు. కుమారులు లేకపోయినా వెనుకడుగు వేయకుండా లత, ప్రసన్న తండ్రి పాడెను తమ భుజాలపై మోశారు. పెద్ద కుమార్తె జ్యోతి హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చివరి ప్రయాణంలో కుమార్తెలే అండగా నిలిచిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
- M Sivakumar
- Updated on: Aug 18, 2026
- 11:41 am
ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్తో వినూత్న దేశభక్తి ప్రదర్శన! వీడియో ఇదిగో
Kankipadu Drone National Flag: కృష్ణా జిల్లా కంకిపాడులో పచ్చని పంట పొలాలపై జాతీయ జెండాను మోస్తూ డ్రోన్ ఎగిరింది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు దేశభక్తిని జోడించిన ఈ వినూత్న దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన చేశారు.
- M Sivakumar
- Updated on: Aug 15, 2026
- 1:48 pm
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 2 కొత్త సర్వీసులు ..ఆ రెండు ప్రధాన నగరాలకు కనెక్టింగ్ షురూ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రధాన గేట్వేగా వెలుగొందుతున్న విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులకు మరో సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో గన్నవరం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసి, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరాలకు కొత్త నేరుగా విమాన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
- M Sivakumar
- Updated on: Aug 13, 2026
- 6:34 pm
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే?
పాము కాటు వల్ల ప్రాణాలు పోయిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. పాము కాటేసిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే విషం శరీరమంతా వ్యాపిస్తే పరిస్థితి ప్రాణాపాయంగా మారొచ్చు. కొన్నిసార్లు ఈ గ్యాప్లోనే ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి ఈ గ్యాప్ను తగ్గించి..ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై108 అంబులెన్సుల్లోనే పాముకాటు విరుగుడు మందు యాంటీ స్నేక్ వెనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
- M Sivakumar
- Updated on: Aug 8, 2026
- 7:15 pm
వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. ఏపీటీడీసీ బంపర్ ఆఫర్.. ఇదిగో పూర్తి వివరాలు
భక్తులు, పర్యాటకులకు ఏపీటీడీసీ శుభవార్త అందించింది. విజయవాడ నుంచి వాడపల్లి వరకు ఒకరోజు తీర్థయాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రవాణా, భోజన వసతులతో ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
- M Sivakumar
- Updated on: Aug 5, 2026
- 1:42 pm
మిట్ట మధ్యాహ్నమే దేశమంతా చిమ్మ చీకటి.. ఆగస్టు 12న ఏం జరగబోతుందో తెలుసా?
ఆకాశంలో అరుదైన అద్భుతం ఆవిష్కృతం కానుంది. సాధారణ రోజుల్లోలా కాకుండా ఆరోజు మనకు సూర్యుడు బిన్నంగా కనిపిస్తాడు. ఎప్పుడూ భగభగ మండుతూ వెలిగిపోయే సూర్యూడు ఆరోజు మాత్రం.. నల్లగా మారిపోనున్నాడు. అదే సంపూర్ణ సూర్య గ్రహణం. ఇంతరూ ఆ గ్రహం ఎప్పుడు సంభవించబోతుందనేగా మీ డైట్ అదితెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Sivakumar
- Updated on: Aug 11, 2026
- 6:51 pm
భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతి హిందువు మనసులో ఉంటుంది. అయితే సమయం, ప్రయాణ భారం, భక్తుల రద్దీ కారణంగా ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం దక్కదు. అలాంటి భక్తులకు తిరుమల తరహా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం రోజురోజుకూ భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది. ప్రశాంతమైన వాతావరణం, వైఖానస ఆగమశాస్త్ర పద్ధతిలో పూజలు, ఉచిత ఏసీ బస్సు, నిత్య అన్నదానం, ఆధునిక సౌకర్యాలతో ఈ ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది..
- M Sivakumar
- Updated on: Aug 2, 2026
- 6:37 pm