హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
ATS వర్సెస్ మాన్యువల్ తనిఖీలు.. స్కూల్ బస్సుల ఫిట్నెస్పై కొత్త సందిగ్ధత!
ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల పునఃప్రారంభం కానున్న తరుణంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈసారి తనిఖీ విధానం రవాణా రంగంలో మరియు విద్యాసంస్థల యాజమాన్యాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) ఉండగా, అధికారులు మళ్లీ ఫీల్డ్లోకి వచ్చి బస్సులను తనిఖీ చేయాల్సిన అవసరం ఏముందనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
- M Sivakumar
- Updated on: May 9, 2026
- 10:38 am
Andhra Pradesh: ఫ్యూచర్ రెడీ సంకల్పంలో కీలక ఘట్టం.. సింగపూర్ పర్యటనలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ రెడీ సంకల్పం దిశగా ఏపీ ఉపాధ్యాయులు అడుగులు వేస్తున్నారు. కేవలం తరగతి గదులకే పరిమితంకాకుండా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను అందిపుచ్చుకునేందుకు 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనలో ఉంది..
- M Sivakumar
- Updated on: May 4, 2026
- 8:42 pm
ఇదేం వింత మావ.. రావి చెట్టుకు మామిడికాయలా!.. ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో వీడియో
విజయవాడ సమీపంలోని రామవరప్పాడు జాతీయ రహదారిపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక వినూత్న మార్కెటింగ్ ఐడియాతో ఓ వ్యాపారి చేస్తున్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకూ జనాలు ఆకర్షించేందుకు ఆ వ్యాపారి చేసిన ఆలోచన ఏంటో చూద్దాం పదండి.
- M Sivakumar
- Updated on: May 4, 2026
- 8:23 pm
NTR Bharosa: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్న్యూస్.. కొత్త పింఛన్లపై కీలక అప్డేట్!
ప్రతి నెల మొదటి తేదీ.. ఇది చాలామందికి కేవలం క్యాలెండర్లోని ఒక రోజు మాత్రమే. కానీ వేలాది వృద్ధులకు అది జీవితం సాగించే రోజు. వితంతువులకు అది నిలబెట్టే నమ్మకం. దివ్యాంగులకు ముందుకు నడిపించే ధైర్యం. ఆ నమ్మకాన్ని ఆ భరోసాను మరింత బలంగా మార్చిన పథకమే ఎన్టీఆర్ భరోసా. ఈ పథకం కింద ప్రభుత్వం అందించే పెన్షన్ మొత్తాలను పెంచుతూ అవసరమైన వారి ఇంటి ముంగిటకే చేరే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో సామాజిక భద్రతకు కొత్త నిర్వచనం ఇస్తోంది.
- M Sivakumar
- Updated on: May 4, 2026
- 7:41 pm
Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..
నువ్వు చేయలేవు.. అని లోకం వెక్కిరించిన చోటే.. మేమేంటో చూపిస్తాం అని గర్జించిన చిచ్చరపిడుగుల కథ ఇది. శారీరక వైకల్యం, పేదరికం, ఆకలి.. ఇలా అన్ని వైపుల నుండి కష్టాలు చుట్టుముట్టినా, వాళ్ల నిశ్చయం ముందు హిమాలయాల ఎత్తు కూడా చిన్నబోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 21 మంది విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్పై విజయకేతనం ఎగురవేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.
- M Sivakumar
- Updated on: May 1, 2026
- 10:11 pm
స్నానం చేసేందుకు నదిలో దిగిన స్థానికులు.. మెరుస్తూ కనిపించింది ఏంటా అని చూడగా..
కృష్ణా నదిలో స్థానికులకు కనిపించిన పంచలోహ శ్రీరామ విగ్రహం సంచలనం సృష్టించింది. గుడిమెట్ల వద్ద బయటపడిన ఈ శిల్పం శతాబ్దాల నాటి ఆలయానికి చెందినదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు దీన్ని దైవ సంకేతంగా భావిస్తుండగా, అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖతో దాని చరిత్రను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించారు.
- M Sivakumar
- Updated on: May 1, 2026
- 3:06 pm
APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం
ప్రయాణికుల సౌకర్యం, పర్యావరణ పరిరక్షణ, ఖర్చుల తగ్గింపు ఈ మూడు లక్ష్యాలతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ బస్సులను ఆధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతూ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వైపు అడుగులు వేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఈ మార్పులు ప్రయాణికులకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం.
- M Sivakumar
- Updated on: Apr 27, 2026
- 4:43 pm
జస్ట్ 20 నిమిషాలే.. ఆ రూట్లో ప్రయాణం మరింత సులభం.. ఇక దూసుకెళ్లడమే
అమరావతికి వచ్చే విఐపిల రాకపోకలను మరింత సులభం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూట్ను సిద్ధం చేస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వెస్ట్ బైపాస్ ద్వారా రాజధానిలోకి చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నగర ట్రాఫిక్కు దూరంగా ఉండే ఈ మార్గం ద్వారా ప్రయాణం వేగవంతం కావడంతో పాటు భద్రతా పరంగా కూడా అనుకూలంగా ఉండనుంది.
- M Sivakumar
- Updated on: Apr 26, 2026
- 4:42 pm
హుండీ ఘటన తర్వాత హై అలర్ట్.. దుర్గమ్మ ఆభరణాలు నిజంగా సేఫ్గా ఉన్నాయా?
Vijayawada Durgamma Ornaments: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆభరణాల భద్రతపై చర్చ కొనసాగుతోంది. ఇటీవల హుండీ లెక్కింపు సమయంలో ఒక వ్యక్తి బంగారం మార్పిడి ప్రయత్నంలో పట్టుబడటం భక్తుల్లో ఆందోళన కలిగించింది. దీంతో ఆలయ భద్రత, స్ట్రాంగ్ రూమ్లు, సీసీ కెమెరాలు, ఆడిట్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనతో దేవాదాయ శాఖ అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది.
- M Sivakumar
- Updated on: Apr 26, 2026
- 12:05 pm
Amaravati: అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం.. ఎలా ఉందో చూడండి
ఒకప్పుడు విమర్శల వలయంలో నిలిచిన నేల.. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. అత్యాదునిక హంగులతో కొత్త భవనాలు ఆ ప్రాంత రూపురేఖలనే మర్చేస్తున్నాయి.. అదే ఏపీ రాజధాని నగరమైన అవరావతి. ఇప్పుడు ఆ మార్పుకు కొత్త గుర్తుగా సీఎం చంద్రబాబు నివాసం నిలుస్తోంది. గతేడాది ఏప్రిల్లో శంకుస్థాపన జరగ్గా.. ఇప్పటికే ఇంటి నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. దీంతో ఒక్కప్పుడు అడవిని తలపించిన వెలగపూడి ప్రాంతం ఆధునిక నిర్మాణాలతో మెరుస్తూ కొత్త రూపం సంతరించుకుంది.
- M Sivakumar
- Updated on: Apr 25, 2026
- 3:20 pm
Amaravati: హై స్పీడ్లో అమరావతి నిర్మాణం.. వినియోగానికి సిద్ధమైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న విల్లాలు తుది దశకు చేరుకోవడం విశేషం. ఈ నివాస భవనాల్లో అంతర్గత ఇంటియర్ పనులు కూడా వేగంగా పూర్తవుతూ, త్వరలోనే వినియోగానికి సిద్ధమవుతున్నాయి. జడ్జిల కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ కూడా అందంగా ముస్తాబవుతున్నాయి.
- M Sivakumar
- Updated on: Apr 24, 2026
- 12:00 pm
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా..
బెజవాడలో ఎండలంటే.. అది సాధారణ వేడి కాదు, ఒక్క అడుగు బయట పెట్టాలంటేనే గుండె దడ పెంచే స్థాయి, ఉదయం సూర్యుడు కాస్త వెలిగినా సరే.. మధ్యాహ్నానికి వచ్చేసరికి నగరం మొత్తం అగ్ని గోళంలా మారిపోతుంది. రోడ్లపై నుంచి ఎగిసే ఎండ మంటలు, వేడి అలలు, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ప్రజలు అందరూ ఇంటికే పరిమితం అయిపోతున్నారు.
- M Sivakumar
- Updated on: Apr 20, 2026
- 8:22 am