ఇంద్రకీలాద్రి మహా శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. దుర్గా మల్లేశ్వర స్వామికి మంగళస్నానాలు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరణ చేశారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శాంతి కల్యాణ వేదిక వద్ద ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలుత గణపతి పూజను ఆలయ అర్చకులు నిర్వహించగా, ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో కేఎస్ రామారావు దంపతులు హాజరయ్యారు.