హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే?
పాము కాటు వల్ల ప్రాణాలు పోయిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. పాము కాటేసిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే విషం శరీరమంతా వ్యాపిస్తే పరిస్థితి ప్రాణాపాయంగా మారొచ్చు. కొన్నిసార్లు ఈ గ్యాప్లోనే ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి ఈ గ్యాప్ను తగ్గించి..ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై108 అంబులెన్సుల్లోనే పాముకాటు విరుగుడు మందు యాంటీ స్నేక్ వెనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
- M Sivakumar
- Updated on: Aug 8, 2026
- 7:15 pm
వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. ఏపీటీడీసీ బంపర్ ఆఫర్.. ఇదిగో పూర్తి వివరాలు
భక్తులు, పర్యాటకులకు ఏపీటీడీసీ శుభవార్త అందించింది. విజయవాడ నుంచి వాడపల్లి వరకు ఒకరోజు తీర్థయాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రవాణా, భోజన వసతులతో ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
- M Sivakumar
- Updated on: Aug 5, 2026
- 1:42 pm
మిట్ట మధ్యాహ్నమే దేశమంతా చిమ్మ చీకటి.. ఆగస్టు 12న ఏం జరగబోతుందో తెలుసా?
ఆకాశంలో అరుదైన అద్భుతం ఆవిష్కృతం కానుంది. సాధారణ రోజుల్లోలా కాకుండా ఆరోజు మనకు సూర్యుడు బిన్నంగా కనిపిస్తాడు. ఎప్పుడూ భగభగ మండుతూ వెలిగిపోయే సూర్యూడు ఆరోజు మాత్రం.. నల్లగా మారిపోనున్నాడు. అదే సంపూర్ణ సూర్య గ్రహణం. ఇంతరూ ఆ గ్రహం ఎప్పుడు సంభవించబోతుందనేగా మీ డైట్ అదితెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Sivakumar
- Updated on: Aug 11, 2026
- 6:51 pm
భక్తుల కోరిక నెరవేరుస్తున్న వెంకన్న.. కృష్ణాజిల్లాకు పరుగులు పెడుతున్న భక్తులు
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతి హిందువు మనసులో ఉంటుంది. అయితే సమయం, ప్రయాణ భారం, భక్తుల రద్దీ కారణంగా ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం దక్కదు. అలాంటి భక్తులకు తిరుమల తరహా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ కృష్ణా జిల్లాలోని డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం రోజురోజుకూ భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోంది. ప్రశాంతమైన వాతావరణం, వైఖానస ఆగమశాస్త్ర పద్ధతిలో పూజలు, ఉచిత ఏసీ బస్సు, నిత్య అన్నదానం, ఆధునిక సౌకర్యాలతో ఈ ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది..
- M Sivakumar
- Updated on: Aug 2, 2026
- 6:37 pm
వరదలకు చెక్ పెట్టేందుకు విజయవాడ అధికారుల వినూత్న ప్లాన్.. కాలువల్లో పడవ ప్రయాణం!
విజయవాడలోని కృష్ణలంకలోని అంబేద్కర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వీఎంసీ బయాలజిస్ట్ సీహెచ్. సూర్య నాయక్ ఆధ్వర్యంలో అధికారులు బందర్ కాలువలో పడవలో ప్రయాణిస్తూ కాలువ పరిస్థితిని పరిశీలించారు. అదే సమయంలో లౌడ్స్పీకర్ల ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
- M Sivakumar
- Updated on: Jul 22, 2026
- 6:55 pm
Mini Amazon: ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడో తెలుసా..?
అమరావతి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ భవనాలు, విశాలమైన రహదారులు, అభివృద్ధి పనులే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు రాజధానికి మరో కొత్త గుర్తింపు లభిస్తోంది. అదే మినీ అమెజాన్ అడవులు. వేలాది చెట్లతో పచ్చని ప్రకృతి వనంగా మారుతున్న ఈ ప్రాంతం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..
- M Sivakumar
- Updated on: Jul 17, 2026
- 12:38 pm
Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. 45 రకాల పరీక్షలు ఫ్రీ.. ఒక్క రూపాయి కూాడా ఖర్చు లేదు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక డిజిటల్ డయాగ్నస్టిక్ హబ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా 45 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఇది పేదలకు వరంగా మారనుంది. ఖరీదైన క్యాన్సర్ మానిటరింగ్ పరీక్షలు కూడా చేయనున్నారు. మరిన్ని వివరాలు చూస్తే..
- M Sivakumar
- Updated on: Jul 11, 2026
- 4:50 pm
APSRTC: అందులో ఎలాంటి వాస్తవం లేదు.. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ!
ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలకు ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. డిపోలు ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారం, ఉద్యోగాల కోతపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల అమలు, జీసీసీ విధానం, ఉద్యోగుల భద్రతపై కీలక వివరాలు వెల్లడించింది.
- M Sivakumar
- Updated on: Jul 9, 2026
- 6:18 pm
విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.200కే ఏసీ విశ్రాంతి సౌకర్యం!
విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక రైలు కోసం గంటల తరబడి ప్లాట్ఫామ్పై వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఆధునిక స్లీపింగ్ పాడ్స్ సేవలను ప్రారంభించారు. ప్లాట్ఫామ్ నంబర్-1లో ఏర్పాటు చేసి మొత్తం 168 స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి.
- M Sivakumar
- Updated on: Jul 8, 2026
- 11:24 am
Chicken Rates: కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.340-350 వరకు, డ్రెస్డ్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తుండగా, డజను గుడ్ల ధర రూ.90-100కు చేరింది. ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల, సరఫరా లోపం, పెరిగిన డిమాండ్ కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
- M Sivakumar
- Updated on: Jul 5, 2026
- 10:23 am
మూడు దశాబ్దాల ప్రజాసేవ చేసిన ఉద్యోగికి చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కలేదు..
మూడు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగి సిరా రామారావుకు మరణానంతరం చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కలేదు. అద్దె ఇంటి యజమాని భౌతికకాయాన్ని ఇంటి ముందు ఉంచేందుకు అనుమతించకపోవడంతో, రోడ్డుపైనే నివాళులర్పించి అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చిన ఘటన కంకిపాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.
- M Sivakumar
- Updated on: Jul 4, 2026
- 12:13 pm
Andhra Pradesh: కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం
ఏపీ టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిలో సోలార్ బోట్లను తీసుకొచ్చింది. డీజిల్ బోట్ల స్థానంలో వీటని కొత్తగా ప్రవేశపెట్టింది. దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి.
- M Sivakumar
- Updated on: Jul 3, 2026
- 6:09 pm