హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
Andhra Pradesh: పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..
గుంటూరు జిల్లాలో వెలసిన ఉండవల్లి గుహలు దేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుహలు చారిత్రక వైభవాన్ని మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతను కూడా ప్రతిబింబిస్తాయి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం అనంతరం సందర్శకులు తప్పక వెళ్లే ప్రదేశంగా ఇవి ప్రత్యేక గుర్తింపు పొందాయి.
- M Sivakumar
- Updated on: Apr 13, 2026
- 2:23 pm
ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్.. ఒక్క పాయింట్ తేడాతో చరిత్ర సృష్టించిన భారత్..!
ఒక్క పాయింట్.. అవును.. కేవలం ఒక్క పాయింట్ తేడాతో భారత జట్టు చరిత్ర సృష్టించింది. మెక్సికోలోని ప్యూబ్లా వేదికపై ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ విజయం వెనుక ఉన్న కథ. ప్యూబ్లా ఆకాశం కింద ఆ క్షణం అసాధారణం.. గాలి కూడా ఆగిపోయినట్టే అనిపించింది. ప్రపంచం మొత్తం ఒక్క దిశగా చూస్తోంది. స్కోర్ బోర్డు ఉత్కంఠను మరింత పెంచుతోంది.
- M Sivakumar
- Updated on: Apr 12, 2026
- 3:46 pm
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఈ ఘటన అత్యంత విషాదకరం. చేతికొచ్చిన కుమారుడిపై కొండంత ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఈ వార్త ఒక్కసారిగా కుంగిపోయేలా చేసింది. వెళ్లొస్తానమ్మా అని ఇంటి నుంచి బయలుదేరిన కొడుకు తిరిగి వస్తాడని ఎదురుచూస్తుండగానే అతడు ఇక లేడనే వార్త విని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.. తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తూ జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- M Sivakumar
- Updated on: Apr 11, 2026
- 11:33 am
ఇంటాయనకు సుస్తి.. కుటుంబానికి పోషించేందుకు భర్త వృత్తిని చేపట్టిన భార్య..
భర్త అనారోగ్యంతో కుటుంబం కుదేలైన వేళ… గృహిణిగా ఉన్న శ్రీలక్ష్మి జీవితమే మారిపోయింది. కూలీ పనులతో ప్రారంభించిన ఆమె, చివరికి భర్త వృత్తినే ఆయుధంగా మార్చుకుని బైక్ మెకానిక్గా నిలదొక్కుకుంది. సమాజం వ్యంగ్యాలు పట్టించుకోకుండా కష్టంతో ముందుకు సాగి, ఇప్పుడు కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా మారింది.
- M Sivakumar
- Updated on: Apr 10, 2026
- 12:48 pm
ఇంద్రకీలాద్రిపై ఫేక్ అర్చకుడి వివాదం.. నకిలీ పత్రాలతో ఉద్యోగ యత్నం?
Fake Priest Appointment Attempt Exposed at Indrakeeladri Temple: నామయ్య అనే అర్చకుడి పేరుతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో ఈ వ్యవహారం వెనుక పునరావృత ప్రయత్నాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, సంబంధిత పత్రాల ఆధారంగా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పొందినట్టు ప్రచారం జరుగుతోంది.
- M Sivakumar
- Updated on: Apr 9, 2026
- 12:14 pm
Hyderabad: హైదరాబాద్ టూ విజయవాడ 5 గంటలు కాదు ఇక గంట ప్రయాణం.! రయ్.. రయ్మంటూ..
హైదరాబాద్ నుంచి విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ప్రయాణాన్ని త్వరగా పూర్తీ చేసేందుకు మరిన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. ఇది తెలుసుకోండి.
- M Sivakumar
- Updated on: Apr 3, 2026
- 12:35 pm
Andhra: ఫోన్పే వాడుతున్నారా..? బీఅలర్ట్.. ఇలాంటోడు షాపునకు వచ్చాడో గల్లాపెట్టి గల్లంతే..
ఫేక్ ఫోన్పే ట్రాన్సాక్షన్తో దుకాణదారుని మోసం చేసిన ఘటన సంచలంగా మారింది. సాధారణ కస్టమర్లా వచ్చి, మొబైల్ స్క్రీన్లో పేమెంట్ అయ్యిందని చూపించిన కేటుగాడు వేల రూపాయల సరుకుతో పరారైన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- M Sivakumar
- Updated on: Apr 2, 2026
- 12:23 pm
అందినకాడికి దోచుకోవాలనుకున్నారు.. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మరి..? ఎలా పట్టుబడ్డారో చూడండి!
ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి. లెక్కింపు సమయంలో వచ్చిన అసలైన బంగారు ఆభరణాలను దారి మళ్లించేందుకు యత్నించారు. కొంతమంది సిబ్బంది రోల్డ్ గోల్డ్ గా చూపిస్తూ పక్కన పెట్టే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం కలగడంతో వెంటనే తనిఖీలు చేపట్టారు.
- M Sivakumar
- Updated on: Mar 31, 2026
- 1:57 pm
పర్యాటకులారా తస్మాత్ జాగ్రత్త.. మూలపాడు పార్కులోని జిప్ లైన్ ప్రాణాలకే ప్రమాదం?
NTR district butterfly park safety issues: ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక్క చిన్న తప్పు.. చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉందని పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. చిన్న సంఘటనగా మిగలదు. విషాదంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
- M Sivakumar
- Updated on: Mar 30, 2026
- 4:00 pm
Andhra News: కృష్ణమ్మ అలలపై అద్భుత దృశ్యం.. వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాధారణంగా రాజకీయ ర్యాలీలు రోడ్లపై జరుగుతాయి. కానీ ఏపీలో మాత్రం రాజకీయ ర్యాలీకి కృష్ణానది వేదికగా మారింది. అలల మధ్య సాగిన బోట్లపై పసుపు జెండాలు రెపరెపలాడుతుంటే. నదంతా ఒక రాజకీయ ఉత్సవంగా మారిపోయింది. తాడేపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇంత వినూత్నంగా, వైభవంగా జరగడం ప్రాంతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- M Sivakumar
- Updated on: Mar 29, 2026
- 4:27 pm
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక భక్తులకు ఇక్కట్లు!
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నా, తగిన వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాటేజీల కొరత వల్ల దర్శనం చేసుకుని వెంటనే వెనుదిరగాల్సి వస్తోంది. గత దశాబ్దంగా కాటేజీల నిర్మాణానికి అనేక ప్రతిపాదనలు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. భక్తుల సౌలభ్యం, ఆలయ ఆదాయం కోసం కాటేజీల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
- M Sivakumar
- Updated on: Mar 27, 2026
- 4:28 pm
మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్లో చిక్కుకోవద్దంటే ఇలా చేయండి
Vijayawada west bypass traffic changes: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త నిబంధనల ప్రకారం.. గుంటూరు వైపు నుంచి విజయవాడ, మంగళగిరి చేరాలనుకునే ప్రయాణికులు ముందుకు వెళ్లే అవకాశం లేకుండా కొత్త మార్పులు చేశారు. ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలు కదులుతున్నాయని అధికారులు తెలిపారు.
- M Sivakumar
- Updated on: Mar 26, 2026
- 5:37 pm