నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేగింది. పాఠశాల వరండాలో పసుపు, కుంకుమ, వేపాకులు, కత్తి కనిపించాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. సర్పంచ్ మూడ్ ప్రకాష్ వరండాను శుభ్రం చేయించి, మూఢనమ్మకాలు నమ్మవద్దని అవగాహన కల్పించారు.