AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఇవాళ ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి జగన్ టూర్.. జోరుగా రాజధాని తరలింపు అంశం..

విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని చెప్పిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలోజిల్లాలో పర్యటిస్తారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో..

CM Jagan: ఇవాళ ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి జగన్ టూర్.. జోరుగా రాజధాని తరలింపు అంశం..
CM Jagan
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Oct 16, 2023 | 9:20 AM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని, ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభించనున్నారు.

విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని చెప్పిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలోజిల్లాలో పర్యటిస్తారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్‌పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు..

  • ఉ.10:20 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్‌
  • మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌ సెంటర్‌ ప్రారంభం
  • ఉ.10.50 నుంచి 11.55వరకు ఇన్ఫోసిస్‌లోనే జగన్‌

ఇవాళ ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి 10.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో మధురవాడ ఐటీ హిల్స్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు వెళ్లనున్నారు. 10.50 గంటల నుంచి 11.55వరకు అక్కడే జగన్ గడుపుతారు. తర్వాత జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను జగన్ ప్రారంభిస్తారు.

ప్రత్యేక విమానంలో గన్నవరంకు..

  • మ.12.05కి అనకాపల్లిజిల్లా పరవాడ ఫార్మాసిటీలో..
  • యుగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభించనున్న జగన్‌
  • మ.1.30కి అచ్యుతాపురంలోని లారస్ ల్యాబ్ యూనిట్‌ 2 ప్రారంభం
  • మ.3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం

అనంతరం హెలికాఫ్టర్‌లో 12.05 గంటలకు అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, అధికారులతో మాట్లాడిన తర్వాత ఫార్మాసిటీలో యుగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి అచ్యుతాపురంలోని ఏపీఎస్ఈజెడ్‌కు చేరుకుని లారస్ ల్యాబ్ యూనిట్‌ 2ను ప్రారంభిస్తారు. తర్వాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని.. అక్కడి నుంచి 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి