AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నర్సారావుపేట బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం.. తల్లి కళ్లెదుటే ఘోరం..

నర్సారావు పేటలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం అయ్యింది. పిల్లవాడు తల్లి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అదెలా చెప్పాలో తెలియక.. బాలుడు మిస్ అయ్యాడుంటూ..

Andhra Pradesh: నర్సారావుపేట బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం.. తల్లి కళ్లెదుటే ఘోరం..
Boy Missing
Shiva Prajapati
|

Updated on: Jan 22, 2023 | 12:44 PM

Share

నర్సారావు పేటలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం అయ్యింది. పిల్లవాడు తల్లి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అదెలా చెప్పాలో తెలియక.. బాలుడు మిస్ అయ్యాడుంటూ ఇరుగుపొరుగు వారికి అబద్ధాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా, నర్సరావుపేటలో ఒక సంవత్సరం వయసున్న బాలుడు.. మిస్ అయిన ఘటన కలకలం రేపింది. తన కొడుకు కనిపించడం లేదంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. బాలుడు నేలబావిలో పడి మృత్యువాత పడినట్లు గుర్తించారు. పిల్లవాడిని బావి పిట్టగోడపై కూర్చోబెట్టి, తల్లి ఆడిస్తుండగా.. జారి బావిలో పడ్డాడు ఏడాది వయస్సున్న పసివాడు. కళ్ళముందే పసివాడు కన్నుమూయడంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిన తల్లి బాలుడు కనిపించడం లేదంటూ చుట్టుపక్కల వారికి చెప్పింది. అయితే పోలీసుల విచారణలో అది ప్రమాదం అని బయటపడింది. బాలుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు పోలీసులు.

నరసరావుపేట రూరల్ పరిధిలోని స్థానికబ్యాంక్‌కాలనీకి చెందిన బండి వాసు, సాయిలక్ష్మీ దంపతులకు కూతురు మోక్ష(4), కుమారుడు భాను ప్రకాష్ (1 సంవత్సరం) ఉన్నారు. అయితే, కుమారుడు భానుప్రకాశ్‌ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో కనిపించకుండాపోయాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ వేగవంతం చేశారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో అంతా వెతికినా ఫలితం లేకపోయింది. నేరుగా డిఎస్పీ విజయ్ భాస్కరరావు తన పోలీస్ బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి అదృశ్యం అయిన ప్రదేశం, ఘటన జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ ఏరియాలో సీసీ ఫుటేజీని పరిశీలించారు. చివరకు కూతురు చేతుల్లోంచి పడి బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే