AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Marriage: ఆధార్‌ కార్డులో వివరాలు మార్చి బాల్య వివాహానికి యత్నం.. చివరికి ఏం జరిగిందంటే?

అబ్బాయికి 17, అమ్మాయికి 13 ఏళ్లు. అయినా పెళ్లి చేయాలని నిశ్చయించారు ఇరు కుటుంబాల పెద్దలు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలి. కానీ సడెన్ గా.. పిలవని పేరంటానికి అతిథులు వచ్చినట్లు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాల్య వివాహం చేస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో పెళ్లి మండపం వద్దకు వెళ్లారు

Child Marriage: ఆధార్‌ కార్డులో వివరాలు మార్చి బాల్య వివాహానికి యత్నం.. చివరికి ఏం జరిగిందంటే?
Marriage
Nalluri Naresh
| Edited By: |

Updated on: Nov 08, 2023 | 6:53 PM

Share

అబ్బాయికి 17, అమ్మాయికి 13 ఏళ్లు. అయినా పెళ్లి చేయాలని నిశ్చయించారు ఇరు కుటుంబాల పెద్దలు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలి. కానీ సడెన్ గా.. పిలవని పేరంటానికి అతిథులు వచ్చినట్లు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాల్య వివాహం చేస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో పెళ్లి మండపం వద్దకు వెళ్లారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు బురిడీ కొట్టించాలనుకున్నారు. 19 ఏళ్ళు నిండిన అమ్మాయి మేజర్ అయినందున పెళ్లి చేస్తున్నామని మొదటి చెప్పారు. పోలీసులకు ఆధార్ కార్డు ప్రూఫ్ కూడా చూపించారు. ఇక్కడే అసలు విషయం ఉంది. సరిగ్గా నెల రోజుల క్రితమే ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్న సందర్భంలో అమ్మాయి వయసు 13 ఏళ్లు ఉంటే.. 19 సంవత్సరాలుగా మార్చారు తల్లిదండ్రులు. అనంతపురం రూరల్ బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు మైనర్లకు పెళ్లి చేసుకున్న రెండు కుటుంబాల వారికి పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధులు కౌన్సిలింగ్ చేశారు. ఎవరైనా పెళ్లికి అడ్డు చెప్పకుండా ఉండేందుకు పకడ్బందీగానే మైనర్ బాలిక తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆధార్ కార్డులో వయసు మార్చడం, ఎవరైనా అడిగితే తనకు 19 ఏళ్ళని అమ్మాయితో చెప్పించడం లాంటివి ముందే ప్లాన్ చేసుకున్నారు. అయినా పోలీసుల ఎంట్రీతో మొత్తానికి బాల్య వివాహం క్యాన్సిల్ అయింది. ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో మైనర్ల పెళ్లి ఆగిపోయింది.  కాగా తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇక్కడి జనాల్లో మార్పు రావడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం