31 December 2025

ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా షేక్.. దెబ్బకు క్యూ కట్టిన ఆఫర్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో నేషనల్ క్రష్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రుక్మిణి వసంత్. ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలే చేస్తుంది.

రుక్మిణి వసంత్.. ఇప్పుడు ఈ అమ్మడి చెంత అదృష్టమే నిలిచింది. సప్త సాగరాలు దాచే సినిమాతో దక్షిణాది అడియన్స్ దృష్టిని ఆకర్షించింది.

తర్వాత కాంతార చాప్టర్ 1 మూవీతో మొత్తం పాన్ ఇండియా అడియన్స్ హృదయాలు దోచేసింది. కన్నడ, తమిళంలో అలరిస్తుంది.

ఇప్పుడు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతుంది. కాంతార తర్వాతా ఈ అమ్మడుకు సౌత్ లో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 

టాలీవుడ్, కోలీవుడ్ ఆమె అందానికి, నటనకు ఫిదా అయిపోయినట్లే కనిపిస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్, ఇన్నోసెంట్ ఫేస్ ఆకట్టుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ సైతం నటిస్తున్నారు. 

అలాగే ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలోనూ నటిస్తుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. 

అలాగే తమిళంలో  డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయనుందని టాక్. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.