AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP-TS Water Disputes: ఏపీ-తెలంగాణ జల వివాదంపై సీఎం జగన్ సంచలన కామెంట్స్.. వారికి ఇబ్బంది కలుగకూడదనే..

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP-TS Water Disputes: ఏపీ-తెలంగాణ జల వివాదంపై సీఎం జగన్ సంచలన కామెంట్స్.. వారికి ఇబ్బంది కలుగకూడదనే..
Cm Jagan
Shiva Prajapati
|

Updated on: Jun 30, 2021 | 3:33 PM

Share

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై స్పందించిన ఆయన.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని సంయమనం పాటిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మన రాష్ట్రం వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడటం లేదని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారన్న సీఎం జగన్.. తెలంగాణలోని ఏపీ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అని ప్రశ్నించిన సీఎం జగన్.. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. నీటి అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సీఎం జగన్‌ సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాయాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాయాలని నిర్ణయించారు.

Also read:

Gandhi Hospital : కొవిడ్ నోడల్‌ సెంటర్‌గా ఉన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఇక అన్ని సేవలు అందుబాటులోకి.. !