AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కోనసీమలో కూలీల కొరత.. వరినాట్లకు కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు

అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు కూలీల కొరత ఏర్పడటంతో కలకత్తా, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి రైతులు కూలీలను దిగుమతి చేసుకుంటున్నరు. పి.గన్నవరం మండలం ముంగండలో వరి ఉడ్పులు ఊడ్చేదుకు వెస్ట్ బెంగాల్ నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. స్థానికంగా కూలీలు లేకపోవడంతో రైతులు ఒక ఏజెంట్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. అయితే కలకత్తా నుండి వచ్చిన..

Andhra Pradesh: కోనసీమలో కూలీల కొరత.. వరినాట్లకు కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
kolkata Labor
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jul 27, 2024 | 8:07 PM

Share

కోనసీమ, జులై 27: అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు కూలీల కొరత ఏర్పడటంతో కలకత్తా, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి రైతులు కూలీలను దిగుమతి చేసుకుంటున్నరు. పి.గన్నవరం మండలం ముంగండలో వరి ఉడ్పులు ఊడ్చేదుకు వెస్ట్ బెంగాల్ నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. స్థానికంగా కూలీలు లేకపోవడంతో రైతులు ఒక ఏజెంట్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. అయితే కలకత్తా నుండి వచ్చిన కూలీలు ఒకే కలర్ డ్రెస్ ధరించి జై శ్రీరామ్ అంటూ రాముడు పాటలు పాడుతూ వరి పొలంలో పనులు చేస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు. కూలీల యూనిఫామ్, అలాగే శ్రీరాముడి పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఒకప్పుడు కోనసీమలో వరి పొలంలో పనులు చేసే కూలీలు జనపథం పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా పనులు చేసేవారు. అయితే ఇప్పుడు కూలీలు ఎవరూ వరి పొలాల్లో పనులకు రాకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. దీనితో రైతులకు కూలీల కొరత ఏర్పడింది. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. రైతులకు కూలీల కొరత రాకుండా ఉండాలంటే ఉపాధి కూలీలను రైతులకు అనుసంధానం చేయాలని రైతులు అంటున్నారు. లెకపోతే ఇదే పరిస్థితి కొనసాగితే కోనసీమలో వరి రైతులు పూర్తిగా వ్యవసాయం వదిలేసే పరిస్థితులు వస్తాయని కోనసీమ రైతులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం వదిలేస్తామని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వరి పంట వేసే సమయం కాబట్టి రైతులకు పెట్టుబడి పెట్టేందుకు వేల రూపాయలు ఖర్చులు అవుతాయని, కానీ మూడు నెలల క్రితం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని, వెంటనే ధాన్యం బకాయిలు చెల్లించాలని కోనసీమ రైతులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే