AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: 41ఏ నోటీసులు ఇచ్చి మోహిత్‌రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు

హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని.. బెంగళూరులో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపు విచారించి... 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు.

AP News:  41ఏ నోటీసులు ఇచ్చి మోహిత్‌రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు
Chevireddy Mohith Reddy
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2024 | 9:28 AM

Share

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎలక్షన్ పోలింగ్‌ తర్వాత అప్పటి టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో పోలీసులు ఆయన్ను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని.. తిరుపతిలోని ఎస్వీయూ పీఎస్‌కు తరలించి..  కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. మోహిత్ రెడ్డి  విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు కండీషన్ పెట్టారు. అయితే తనపై అక్రమ కేసు పెట్టారని.. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు మోహిత్ రెడ్డి. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్ట్‌తో తిరుపతిలో హీట్ నెలకొంది. మే 14న పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన దాడిలో ఏ 37గా మోహిత్ రెడ్డి పేరు చేర్చారు పోలీసులు. 52 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. మోహిత్‌ను అక్రమ కేసులో అరెస్ట్ చేయించారన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి. మోహిత్ తనకు మించి ప్రజల పక్షాన నిలబడతాడని అన్నారు. ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో.. ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు రుచి చూపిస్తారన్నారు. ప్రజల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా