AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీలో వర్షాలు ఇంకా తగ్గలేదు.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇంకా వీడలేదు. మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 29, సోమవారం మన్యం, అల్లూరి, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో..

AP Rains: ఏపీలో వర్షాలు ఇంకా తగ్గలేదు.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Ravi Kiran
|

Updated on: Jul 28, 2024 | 8:07 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇంకా వీడలేదు. మరో మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 29, సోమవారం మన్యం, అల్లూరి, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విశాఖ,అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అటు తూర్పుగోదావరి జిల్లా వాసులనూ వరద కష్టాలు వెంటాడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. గత వారం రోజులుగా పడవల మీదే ప్రయాణిస్తున్నారు లంక ప్రజలు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో పశ్చిమగోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గుట్టలపై తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ముంపు బాధితులు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు వ్యవసాయ, వాణజ్య పంటలు పూర్తిగా నీట మునగడంతో లబోదిబోమంటున్నారు.

ఇవి కూడా చదవండి

ముంపు గ్రామాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. మంత్రి నిమ్మల రామానాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎలమంచిలి మండలం కనకాయలంకలో వరదలో చిక్కుకున్న మూగజీవాలను అధికారులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. ముంపు బాధితులకు 3వేల రూపాయల ఆర్థికసాయం అందించారు. నగదుతోపాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై