AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఉంటే కలిసి రావట్లేదంటూ కన్నతల్లిని వదిలించుకున్న బిడ్డలు.. వృద్దాశ్రమంలో చేర్చిన కోవిడ్ ఫైటర్స్..

Guntur: కడుపున పుట్టిన పిల్లలే తనను వీధుల పాలు చేస్తారని తెలియని ఆ అమాయకపు తల్లి వారిని నవమాసాలు మోసి కని పెంచింది. ఆలనా పాలనా చూసిన ఆ తల్లికి వృద్దాప్యంలో అండగా వుండాల్సిన పిల్లలే తమకు వద్దని బయటకు నెట్టేశారు. ఆమె తమతో ఉంటే కలిసి రావడం లేదంటూ ఈసడించుకున్నారు. సూటిపోటి మాటలతో వేధించారు. భర్తను కోల్పోయిన ఆమె కన్న బిడ్డల కూడా కనికరం చూపక పోవడంతో చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించింది. గుంటూరులో జరిగిన ఈ ఘనత పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంట్లో ఉంటే కలిసి రావట్లేదంటూ కన్నతల్లిని వదిలించుకున్న బిడ్డలు.. వృద్దాశ్రమంలో చేర్చిన కోవిడ్ ఫైటర్స్..
Ramulamma
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 14, 2023 | 12:03 PM

Share

కడుపున పుట్టిన పిల్లలే తనను వీధుల పాలు చేస్తారని తెలియని ఆ అమాయకపు తల్లి వారిని నవమాసాలు మోసి కని పెంచింది. ఆలనా పాలనా చూసిన ఆ తల్లికి వృద్దాప్యంలో అండగా వుండాల్సిన పిల్లలే తమకు వద్దని బయటకు నెట్టేశారు. ఆమె తమతో ఉంటే కలిసి రావడం లేదంటూ ఈసడించుకున్నారు. సూటిపోటి మాటలతో వేధించారు. భర్తను కోల్పోయిన ఆమె కన్న బిడ్డల కూడా కనికరం చూపక పోవడంతో చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించింది. గుంటూరులో జరిగిన ఈ ఘనత పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాత గుంటూరుకు చెందిన రాములమ్మ, సుబ్బారావు దంపతులు. కూలీ పని చేసుకొని జీవనం సాగించేవారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. యుక్త వయస్సు రాగానే వీరిద్దకి పెళ్లి చేసి పంపించారు. ఆ తర్వాత కొద్దీ కాలానికే సుబ్బారావు చనిపోయాడు. పదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుండి రాములమ్మ తన కన్నబిడ్డల వద్ద ఉంటూ వస్తుంది. అయితే కరోనా ఆమె పట్ల కనికరం చూపించలేక పోయింది.

కరోనా సమయంలో తన కుటుంబాన్ని గడుపుకోవడమే కష్టంగా మారిందంటూ కొడుకు రాములమ్మను బయటకు పంపించాడు. దీంతో ఆమె పొట్ట చేత బట్టుకొని కూతురు ఇంటింకి చేరుకుంది. కొద్దీ కాలం బాగానే చూసుకున్న కూతురు ఆ తర్వాత తల్లి రాములమ్మను సూటి పోటి మాటలతో వేధించడం మొదలు పెట్టింది. ‘నువ్వు మాతో ఉంటే కలిసి రావడం లేదు’ అంటూ దూషించడం మొదలు పెట్టింది. అంతేనా.. ఏకంగా నిన్న ఇంటిలో నుండి వెళ్లి పోవాలంటూ చెప్పింది.

దీంతో దిక్కులేని పరిస్థితిలో గోనే సంచిలో తన బట్టలు సర్ధుకొని ఇంటి నుంచి బయట పడింది రాములమ్మ. ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థితిలో ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. కొత్త పేట పోలీసులకు దండం పెట్టి కూతురు, కొడుకు తనను చూడటం లేదన్న సంగతి చెప్పింది. అయితే కొడుకు, కూతురు ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని వారితో ఇంటికి వెళ్లాలని కొత్త పేట పోలీసులు చెప్పారు. అయితే వారితో వెళ్లేందుకు రాములమ్మ నిరాకరించింది. తనను వృద్ధాశ్రమానికి పంపించాలంటూ పోలీసులను వేడుకుంది. దీంతో పోలీసులు కోవిడ్ ఫైటర్స్‌కు ఫోన్ చేసి చెప్పారు. రంగంలోకి దిగిన కోవిడ్ ఫైటర్స్ రాములమ్మ పొన్నూరు రోడ్డులో ఉన్న గోతాల స్వామి వృద్దాశ్రమంలో చేర్పించారు. కన్నతల్లే బరువైన ఘటన తెలుసుకున్న స్థానికులు రాములమ్మ పరిస్థితిని తలుచుకొని ఆవేదన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..