US Supreme Court: ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్‌ గ్యాస్‌తో మరణశిక్ష అమలు.. 7 నిమిషాల్లోనే మృత్యుఒడికి చేరిన ఖైదీ

నైట్రోజన్‌ గ్యాస్‌తో తొలిసారిగా ఓ ఖైదీకి గురువారం (జనవరి 25) అమెరికా సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. 1982 నుంచి ఈ పద్ధతిలో ఖైదీలకు మరణశిక్షను విధించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన కోర్టు గురువారం అనుమతిచ్చింది. దీంతో తొలిసారిగా కెన్నెత్‌ స్మిత్‌ (58) అనే వ్యక్తికి మరణ శిక్ష విధించేందుకు నైట్రోజన్‌ గ్యాస్‌ వినియోగించవచ్చని తీర్పు వెలువరించింది. 1988లో ఓ మతాధికారి భార్య ఎలిజబెత్‌ సెనెట్‌ను హత్య చేసిన కేసులో..

US Supreme Court: ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్‌ గ్యాస్‌తో మరణశిక్ష అమలు.. 7 నిమిషాల్లోనే మృత్యుఒడికి చేరిన ఖైదీ
Execution By Nitrogen Gas
Follow us

|

Updated on: Jan 26, 2024 | 1:42 PM

అలబామా, జనవరి 26: నైట్రోజన్‌ గ్యాస్‌తో తొలిసారిగా ఓ ఖైదీకి గురువారం (జనవరి 25) అమెరికా సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. 1982 నుంచి ఈ పద్ధతిలో ఖైదీలకు మరణశిక్షను విధించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన కోర్టు గురువారం అనుమతిచ్చింది. దీంతో తొలిసారిగా కెన్నెత్‌ స్మిత్‌ (58) అనే వ్యక్తికి మరణ శిక్ష విధించేందుకు నైట్రోజన్‌ గ్యాస్‌ వినియోగించవచ్చని తీర్పు వెలువరించింది. 1988లో ఓ మతాధికారి భార్య ఎలిజబెత్‌ సెనెట్‌ను హత్య చేసిన కేసులో కెన్నెత్‌ స్మిత్‌ (58) అనే వ్యక్తికి ఈ మేరకు మరణ శిక్ష అమలు చేశారు. అయితే విమర్శకులు దీనిని క్రూరమైన చర్యగా పేర్కొంటున్నారు.

కాగా 2022లోనే ఓ ఇంజక్షన్‌ ద్వారా కెన్నెత్‌ స్మిత్‌కు మరణ శిక్ష విధించేందుకు ప్రయత్నించారు. కానీ ఆఖరి నిమిషయంలో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వకుండా నిలిపేశారు. ఈసారి నైట్రోజన్ వాయువు ద్వారా అతనికి మరణ శిక్ష అమలు చేశారు. అయితే స్మిత్ తరపు న్యాయవాదులు ఈ ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలబామా స్మిత్‌ను ప్రయోగాత్మక పద్ధతికి పరీక్ష సబ్జెక్ట్‌గా వినియోగించడానికి ప్రయత్నిస్తోందని వాదించారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్మిత్‌ న్యాయవాది వాదనలతో విభేదించారు. మరణ శిక్ష విధించడంలో తొలి ప్రయత్నం విఫలమైనందున అలబామా మునుపెన్నడూ ప్రయోగించని ఉరిశిక్ష పద్ధతిని ఎంపిక చేసుకుందని, ప్రపంచం చూస్తోందని వ్యాఖ్యానించింది. దీంతో మెజారిటీ న్యాయమూర్తులు తమ అమోదం తెలిపారు.

7 నిమిషాల్లో అంతా సమాప్తం

స్మిత్‌కు దక్షిణ అలబామా జైలులో మరణశిక్ష అమలు చేశారు. అతడి ముఖానికి రెస్పిరేటర్ మాస్క్ వేసి, అతను పీల్చేగాలిలో నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపించారు. గాలిలో ఆక్సిజన్‌ లేకపోవడం వల్ల అతను దాదాపు ఏడు నిమిషాల్లో శిక్ష అమలు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అతడి మరణాన్ని అలబామా గవర్నర్‌ ధ్రువీకరించారు. వ్యవస్థలో లోపాలను వాడుకుని దాదాపు 4 దశాబ్ధాల పాటు తప్పించుకొన్నాడు. చివరికి తన నేరానికి శిక్ష అనుభవించాబని వ్యాఖ్యానించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన నైట్రోజన్‌ గ్యాస్‌ను వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఐదుగురు మీడియా సభ్యులను అట్మోర్‌లోని హోల్మన్‌ కరెక్షన్‌ ఫెసిలిటీకి తీసుకెళ్లి, వారుప్రత్యక్షంగా వీక్షిస్తుండగా ఈ తతంగం అమలు చేశారు.

ఇవి కూడా చదవండి

నైట్రోజన్ వాయువు పీల్చినవారు సెకనుల వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత నిమిషాల్లో మరణానికి చేరువవుతారు. ఇది మనిషికి తెలిసిన అత్యంత నొప్పిలేని, మానవత్వంతో కూడిన ఉరి పద్ధతి అని ఓ ప్రభుత్వ న్యాయవాది అన్నారు. కానీ కొందరు వైద్యులు, పలు సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. నైట్రోజన్ హైపోక్సియా వల్ల మరణం సంభవిస్తుందనే దానిపై అతి తక్కువ పరిశోధనలు మాత్రమే జరిగాయని, ఈ పద్ధతిని ప్రయోగించే ముందు మరింత పరిశోధన చేసి అమలు చేయాలని అంటున్నారు.

1988లో ఎలిజబెత్ సెనెట్‌ అనే మహిళను సుపారీ తీసుకుని చంపిన కేసులో దోషులుగా తేలిన ఇద్దరిలో స్మిత్ ఒకరు. సెనెట్‌ను చంపడానికి ఆ ఇద్దరు వ్యక్తులకు మృతురాలి భర్త (పాస్టర్‌ ఛార్లెస్‌ సెనెట్‌) ఒక్కొక్కరికి $1,000 చెల్లించారని తేలింది. ఈ కేసులో ఛార్లెస్‌ సెనెట్‌ తన భార్య ఎలిజబెత్‌ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్మును దక్కించుకోవచ్చని ఈ కుట్ర పన్నాడు. ఈ కేసులో ఛార్లెస్‌ పేరు బయటికి రావడంతో ఎలిజబెత్‌ మరణించిన ఎనిమిది రోజులకు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ