Afghanistan Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి మారణహోమం.. ఆరుగురు మృతి… పలువురికి గాయాలు..

 ఆఫ్ఘన్‌లో మళ్లీ మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. ఆత్మాహుతి దాడితో ఆరుగుర్ని పొట్టనబెట్టుకున్నారు. ఆఫ్ఘన్ విదేశాంగ కార్యాలయం దగ్గర జరిగిన ఈ సూసైడ్‌ ఎటాక్‌తో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.  

Afghanistan Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి మారణహోమం.. ఆరుగురు మృతి... పలువురికి గాయాలు..
Kabul Bomb Blast
Follow us

|

Updated on: Mar 28, 2023 | 6:37 AM

ఆఫ్ఘన్‌లో మరోసారి బాంబుల మోత మోగింది. కాబూల్‌లో మారణహోమం సృష్టించారు సూసైబ్‌ బాంబర్‌. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు పేలుళ్లలో ముగ్గురు ఆఫ్ఘన్‌ భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు ప్రకటించింది ఆఫ్ఘన్ ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ కార్యాలయం ముందున్న ఒక వ్యాపార కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. మాలిక్‌ అస్గర్‌ స్క్వేర్‌ దగ్గర తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఓ వ్యక్తిని గుర్తించాయి భద్రతా దళాలు. అతడిని పట్టుకునేలోపే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బాంబులతో తనను తానే పేల్చేసుకున్నాడు. దాంతో, స్పాట్‌లో ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

సూసైడ్‌ బాంబర్‌ బ్లాస్ట్‌తో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సమీపంలో ఆత్మాహుతి ఎటాక్‌ జరగడం ఇది రెండోసారి, అది కూడా మూడు నెలల్లో సెకండ్‌ టైమ్‌ దాడి జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇక, ఈ బ్లాస్ట్‌లో మరణించిన ఆరుగురు కూడా పౌరులే. మరో 12మంది పౌరులు, ముగ్గురు భద్రతాసిబ్బంది గాయపడటంతో వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆత్మాహుతి దాడికి ఎవరు బాధ్యులన్నది తేలలేదు. ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే బాధ్యులని ప్రకటించుకోలేదు. అయితే ఐఎస్‌ఐఎస్‌ పనిగా అనుమానిస్తోంది ఆఫ్ఘన్ ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..