Poveglia Island: ఈ ప్రాంతం మానవ అవశేషాలతో నిర్మాణం.. ఇప్పటి వరకూ ఇక్కడకు వెళ్ళినవారు తిరిగిరాలేదు..

ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లిన బతికి వచ్చిన మనిషి ఒక్కరూ లేరు. దీంతో నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది. ఈ ద్వీపం గురించి తెలుసుకున్న వారు శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు అంతేకాదు ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతూ చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి.  

Poveglia Island: ఈ ప్రాంతం మానవ అవశేషాలతో నిర్మాణం.. ఇప్పటి వరకూ ఇక్కడకు వెళ్ళినవారు తిరిగిరాలేదు..
Most Haunted Place Poveglia
Follow us

|

Updated on: Mar 26, 2023 | 9:27 AM

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలున్నాయి. కొన్ని ప్రదేశాలు చరిత్రలో వెరీ వెరీ స్పెషల్ గా నిలుస్తాయి. కొన్ని ప్రాంతాల చరిత్ర  ఆసక్తికరంగా ఉంటుంది. మరికొన్ని చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల గురించి తెలుసుకుంటే భయంతో వణకాల్సిందే. ఈ రోజు ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాంతం గురించి తెలుసుకోనున్నాం. ఈ ప్రదేశంలో సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు. ఇలా నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర కూడా అంతే ప్రమాదకరమైనది.

ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిషేధ ప్రాంతం ఇటలీలోని వెనిస్.. లిడో నగరాల మధ్య వెనీషియన్ గల్ఫ్. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లిన బతికి వచ్చిన మనిషి ఒక్కరూ లేరు. దీంతో నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది. ఈ ద్వీపం గురించి తెలుసుకున్న వారు శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు అంతేకాదు ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతూ చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి.

ఈ ద్వీపం ఎందుకు ప్రమాదకరమైనది అంటే ఇటలీలో ప్లేగు మహమ్మారి వ్యాపించినప్పుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని భావించిన ప్రభుత్వం దాదాపు 1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకుని వచ్చి వదిలేశారు. ఇలా చేయడం వలన వ్యాధి పెద్దగా వ్యాపించదని ప్రభుత్వం భావించింది. అప్పడు తాము ఈ చర్య తీసుకోవడం సరైనదని ప్రభుత్వం చెప్పింది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే.. ఈ దేశం బ్లాక్ ఫీవర్ అనే మరో వ్యాధి బారిన పడటం ప్రారంభించారు. మళ్లీ ఈ ద్వీపం గురించి ప్రభుతం ఆలోచించడం ప్రారంభించింది. ఆ వ్యాధితో ఎవరు చనిపోయినా.. మరెవరూ ఆ వ్యాధి బారిన పడకుండా అక్కడ ద్వీపంలో ఖననం చేశారు. అందుకే ఈ ద్వీపంలోని సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

చాలా మంది ప్రజలు ఈ ప్రదేశాన్ని శాపగ్రస్తం అని పిలుస్తారు. అంతేకాదు.. అర్ధాయువుతో మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికుల విశ్వాసం. అంతేకాదు ఈ ద్వీపం నుండి తరచుగా వింత శబ్దాలు వినిపిస్తాయని.. తాము విన్నామని చెబుతున్నారు. అందుకనే ఈ స్థలంలోకి వెళ్లడంపై నిషేధాజ్ఞలు విధించింది ప్రభుత్వం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles