AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో జీతం పెంపు.. ఫోన్‌ రీఛార్జ్‌కూ సరిపోదు

అమెరికాలో జీతం పెంపు.. ఫోన్‌ రీఛార్జ్‌కూ సరిపోదు

Samatha J
|

Updated on: Feb 23, 2026 | 8:01 AM

Share

అమెరికాలో మాస్టర్స్ చేసిన భారతీయ విద్యార్థులకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాల్ విసురుతున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం మధ్య, ఒక టెక్కీ తక్కువ జీతం పెంపు, H1B వీసా నిరాకరణపై రెడ్డిట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అమెరికాలో భారతీయ ఐటీ నిపుణుల కష్టాలను ప్రతిబింబిస్తోంది

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావించే భారతీయ విద్యార్థుల కలలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో సవాల్ ఎదుర్కొంటున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం ఐటీ నిపుణులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా, ఒక భారతీయ టెక్కీ రెడ్డిట్ వేదికగా పంచుకున్న ఆవేదన చర్చనీయాంశమైంది. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసి, MNCలో ఆరు నెలలు ఇంటర్న్‌గా పనిచేసిన ఈ నిపుణుడు, ఫుల్ టైం ఆఫర్‌కు షాక్ అయ్యాడు. కంపెనీ కేవలం గంటకు మూడు డాలర్లు (సుమారు 250 రూపాయలు) మాత్రమే జీతం పెంచుతామని ప్రతిపాదించింది. అంతేకాకుండా, H1B వీసా స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి నిరాకరించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, బిజినెస్ ఆటోమేషన్ అనలిస్ట్ రోల్ ఆఫర్ చేయడంతో కెరియర్ వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేశాడు.

మరిన్ని వీడియోల కోసం :

తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?

ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!

టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్

క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే

Follow Us