AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లకు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ధన్యవాదాలు…..ఎందుకంటే …?

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ లకు సీరం సంస్థ సిఈఓ ఆదార్ పూనావాలా కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి తోడ్పడే ముడిపదార్థాలపై గల ఆంక్షలను అమెరికా ఎత్తివేసినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్,  భారత విదేశాంగ మంత్రి  జైశంకర్ లకు  సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ధన్యవాదాలు.....ఎందుకంటే ...?
Adar Poonawalla
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 05, 2021 | 9:40 AM

Share

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ లకు సీరం సంస్థ సిఈఓ ఆదార్ పూనావాలా కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి తోడ్పడే ముడిపదార్థాలపై గల ఆంక్షలను అమెరికా ఎత్తివేసినందుకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్థానిక టీకామందుల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు అమెరికా గత ఫిబ్రవరిలో ఈ బ్యాన్ విధించింది. ఫైజర్ సహా ఇతర వ్యాక్సిన్ల తయారీకి సంబంధించిన ‘ రా మెటీరియల్స్’ పై ఆంక్షలు విధించింది. వీటిని రద్దు చేయాలని ఇండియా కొంతకాలం క్రితమే కోరింది. అయితే అమెరికా తన పాలసీ విధానంలో మార్పులు చేస్తూ తాజాగా ఈ బ్యాన్ ను ఎత్తివేయడంతో ఇక ఇండియా వంటి దేశాలకు ఎంతో సౌలభ్యం కలిగింది. అమెరికా నిర్ణయం వల్ల ఇండియాలో తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింతగా పెంచుకోగలుగుతామని ఆదార్ పూనావాలా అన్నారు. కాగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఇందుకు స్పందిస్తూ ఇండియాలో వ్యాక్సిన్ సప్లయ్ కి ఎలాంటి అవరోధం లేకుండా చూడాలన్నదే మన డిప్లొమసీ అని ట్వీట్ చేశారు. తన డిఫెన్స్ చట్టం కింద అమెరికా వ్యాక్సిన్ ముడిపదార్ధాల ఎగుమతులను గతంలో నిషేధించింది.

జులై 4 కల్లా తమ దేశ జనాభాకంతటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి…ముఖ్యంగా ఇండియాలో దీని కొరతను నివారించేందుకు జైశంకర్ గత నెలలో అమెరికాకు వెళ్లి అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. అలాగే విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ తోనూ సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలించాయి. తాము 25 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ని ఇండియాకు, ఇతర దేశాలకు పంపుతామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇటీవల ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలిపారు.

మరిన్ని  ఇక్కడ చూడండి: Balakrishna : ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య.. ( వీడియో )

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్… త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… ( వీడియో )

Follow Us
పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా?
పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా?
నిద్రలేచిన తర్వాత తొలి 90 నిమిషాలే మీ రోజును నిర్ణయిస్తాయి..
నిద్రలేచిన తర్వాత తొలి 90 నిమిషాలే మీ రోజును నిర్ణయిస్తాయి..
ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..
ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..
జైలు నుంచి వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్
జైలు నుంచి వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఇవ్వకండి
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఇవ్వకండి
మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
హైదరాబాద్‌లోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్!
హైదరాబాద్‌లోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్!
చిన్నారుల్లో 8 ఏళ్లకే పీరియడ్స్‌? తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక
చిన్నారుల్లో 8 ఏళ్లకే పీరియడ్స్‌? తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక
వాట్సాప్ యూజర్‌నేమ్స్‌పై మెటాకు కేంద్రం షాక్..!
వాట్సాప్ యూజర్‌నేమ్స్‌పై మెటాకు కేంద్రం షాక్..!
తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు పడేది ఆరోజే
తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు పడేది ఆరోజే