Taimur Missile: భారత్ను మళ్లీ రెచ్చగొడుతున్న పాక్.. మరో కొత్త క్షిపని పరీక్ష!
భారత్పై ఎప్పుడు దాడి చేద్దామా అని గుంటకాడి నక్కలా కాచుకొని కూర్చొన్న పాకిస్తాన్.. తన రక్షణ రంగంలోకి మరో ఆస్త్రాన్ని చేర్చుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేపిన తైమూర్’ అనే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పీరక్షించినట్టు పాక్ ప్రకటించింది. శనివారం జనవరి 3, 2026న చేపట్టిన పరీక్షలో ‘తైమూర్ క్షిపణి 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించినట్టు పాక్ వైమానిక దళం పేర్కొంది.

శత్రుదేశం పాకిస్తాన్ రక్షణ రంగంలోకి మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తైమూర్ అనే క్రూయిజ్ క్షిపణిని శనివారం విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్తాన్ వైమానిక దళాలు ప్రకటించాయి. శనివారం నిర్వహించిన ఈ ప్రయోగంలో తైమూర్ క్షిపణి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను విజయవంతంగా చేధించినట్టు పాక్ పేర్కొంది. ఈ పరీక్ష సక్సెస్ అవ్వడం, దేశ వైమానిక, రక్షణ సమర్థత విషయంలో కీలక మైలురాయి అని పాక్ సైనిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుంటూ శత్రు క్షిపణులను ఎదుర్కోవడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని పాక్ వర్గాలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ తైమూర్’ క్రూయిన్ క్షిపణి ప్రత్యేకతలు
- పాక్ సైనిక వ్యవస్థలో ఈ క్షిపణి కీలకంగా మారనుంది. ఇది పాక్ సైనిక సామర్థ్యాన్ని పెంచే అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.
- స్వదేశీ పరిజ్ఞానంతో పాక్ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి పేరు తైమూర్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్ మిస్సైల్ (ALCM).
- ఈ తైమూర్ క్షిపణి 600 కిలోమీటర్లు దూంలో భూమిపై, సముద్రంలో ఉన్న శత్రు లక్ష్యాలను సైతం ఈజీగా చేధించగలదు
- ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుందని పాక్ పేర్కొంది.
- సంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లడంలోనూ ఈ తైమూర్ అద్భతంగా పనిచేస్తుంది
- ఈ క్షిపణిని యుద్ధ విమానాల సహాయంతో ప్రయోగించవచ్చు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
