AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Floods: పాక్ లో పదేళ్ల తర్వాత భారీ వరద బీభత్సం.. కళ్ల ఎదుటే కొట్టుకుపోయిన ఇళ్లు.. వీడియో వైరల్

వర్షపాతం అసాధారణ పెరుగుదల కారణంగా, పాకిస్తాన్ దక్షిణ భాగంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీని కారణంగా సింధ్‌లోని 23 జిల్లాలు విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు.

Pakistan Floods: పాక్ లో పదేళ్ల తర్వాత భారీ వరద బీభత్సం.. కళ్ల ఎదుటే కొట్టుకుపోయిన ఇళ్లు.. వీడియో వైరల్
Pakistan Floods
Surya Kala
|

Updated on: Aug 27, 2022 | 5:26 PM

Share

Pakistan Floods: దాయాది దేశం పాకిస్థాన్ లోని ప్రజలను ప్రకృతి వణికిస్తోంది.  వరదల కారణంగా పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ విధ్వంసంలో ఇప్పటివరకు 343 మంది చిన్నారులు సహా 982 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 3 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతేకాదు వరదల కారణంగా 3 కోట్ల 30 లక్షల మందికి పైగా ప్రజలు కూడా వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి సైన్యం సహాయం తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. హోంమంత్రి రాణా సనావుల్లా ఈ మేరకు సమాచారం అందించారు. దశాబ్ద కాలంలోనే రికార్డ్ స్థాయిలో భారీ స్థాయిలో వరదలని చెప్పారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం వరదల కారణంగా గత 24 గంటల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం వరద బాధితుల సహాయార్ధం భద్రతాదళాలు రంగంలోకి దిగాయని చెప్పారు. ఇది ప్రభుత్వానికి దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు పరిపాలనకు సహాయం చేయడానికి సైన్యాన్ని పిలిచే హక్కును ఇస్తుందని హోంమంత్రి రాణా సనావుల్లా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మొత్తం ఎంతమంది మరణించారంటే.. 

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) ప్రకారం, జూన్ 14 నుండి గురువారం వరకు సింధ్ ప్రావిన్స్‌లో వరదలు మరియు వర్షాలకు సంబంధించిన సంఘటనలలో 306 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్‌లో 234 మంది మరణించగా, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్‌  ప్రావిన్సులలో 185 , 165 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 37 మంది, గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో తొమ్మిది మంది మరణించారు. వరదల బీభత్సానికి వరదల్లో ఇల్లు కొట్టుకుని పోయాయి. షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది.

డాన్ న్యూస్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. NDMA డేటా ప్రకారం ఆగష్టు నెలలో పాకిస్తాన్‌లో 166.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది ఇటీవల  కాలంలో సగటు వర్షపాతం 48 మిమీ కంటే 241 శాతం ఎక్కువ. ఈ రుతుపవనం కారణంగా అత్యంత ప్రభావిత ప్రాంతాలైన సింధ్ , బలూచిస్తాన్‌లలో 784 శాతం , 496 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.

వార్తల ప్రకారం, వర్షపాతం అసాధారణ పెరుగుదల కారణంగా, పాకిస్తాన్ దక్షిణ భాగంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీని కారణంగా సింధ్‌లోని 23 జిల్లాలు విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఎన్‌డిఎంఎలో ప్రధాని షాబాజ్ షరీఫ్ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని.. ఇది దేశవ్యాప్తంగా సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తుందని వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్ గురువారం తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముఖ్యంగా హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. ఇస్లామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, “పాకిస్తాన్‌లో ఎనిమిదో రౌండ్ రుతుపవనాలు కొనసాగుతున్నాయి, సాధారణంగా దేశంలో రుతుపవనాలు మూడు నుండి నాలుగు రౌండ్లలో మాత్రమే కురుస్తాయి. పాకిస్తాన్ అపూర్వమైన రుతుపవనాలను ఎదుర్కొంటోంది. అంతేకాదు ఆ దేశ వాతావరణ శాఖ సెప్టెంబర్‌లో మరొక రౌండ్ వర్షాలు కురుస్తాయని అంచనావేస్తున్నారు.

3 కోట్ల మంది నిరాశ్రయులు:

ఈ వారం ప్రారంభంలో ఏర్పడిన వరదలు .. 2010 వరదల కంటే దారుణంగా ఉన్నాయని.. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు దేశంలోని వివిధ ప్రాంతాలలో వంతెనలు, కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారని.. చాలా మందికి తినడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమ దేశ ప్రజలకు సహాయం చేయమని కోరారు. ఇతరదేశాల్లో ఉన్న తమ దేశ ప్రజలు ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు,

సింధ్ అడ్మినిస్ట్రేషన్ 10 లక్షలు, బలూచిస్తాన్ లక్ష టెంట్ల ఏర్పాట్లు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. టెంట్ తయారీదారులందరినీ సంప్రదించామని.. అంతర్జాతీయ దాతల నుండి కూడా సహాయం కోరడం జరిగిందన్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు