AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి.. బెలూన్లతో వదిలారు.. కిమ్ జోంగ్ వింత వాదన..

ఏప్రిల్‌లో 18 ఏళ్ల సైనికుడితోపాటు 5 ఏళ్ల చిన్నారి 'గ్రహాంతరవాసుల లాంటి వస్తువు'ను తాకినట్లు ఉత్తర కొరియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత ఆ ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయంట.

COVID-19: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి.. బెలూన్లతో వదిలారు.. కిమ్ జోంగ్ వింత వాదన..
North Korea Kim Jong
Venkata Chari
|

Updated on: Jul 03, 2022 | 1:47 PM

Share

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన వింత ప్రకటనలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన కరోనా గురించి మరోసారి ఓ వింత వాదన చేశారు. గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాపిస్తోందని కిమ్ జోంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు కూడా గ్రహాంతరవాసుల వల్లే కనుగొన్నట్లు కిమ్ జోంగ్ చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియాతో అనుసంధానమైన సరిహద్దు నుంచి గ్రహాంతరవాసులు ఈ వైరస్‌ను బెలూన్‌లో నింపి విసిరారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభిస్తోందని తెలిపారు.

ఇద్దరు వ్యక్తులు వాటిని తాకారు..

ఏప్రిల్‌లో 18 ఏళ్ల సైనికుడితోపాటు 5 ఏళ్ల చిన్నారి ‘గ్రహాంతరవాసుల లాంటి వస్తువు’ను తాకినట్లు ఉత్తర కొరియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత ఆ ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయంట. అయితే పొరుగు దేశం దక్షిణ కొరియా మాత్రం గ్రహాంతరవాసుల నుంచి వ్యాపిస్తున్న థియరీని నాన్సెన్స్ అంటూ కొట్టిపారేసింది. వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున కిమ్ జోంగ్ వాదనను నమ్మడం కష్టమని సియోల్‌లోని ఒక ప్రొఫెసర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

అలాంటివి కనిపిస్తే సమాచారం ఇవ్వాలి..

ఉత్తర కొరియా వార్తా సంస్థ KCNA ప్రకారం, సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం కొన్ని సూచనలను జారీ చేసింది. సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలు గాలిలో అంటే బెలూన్లు, గ్రహాంతరవాసుల వంటి వాటి గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఎవరైనా అలాంటివి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత కరోనా వైరస్ నుంచి బయటపడినట్లు పేర్కొన్న తర్వాత, ఏప్రిల్ చివరి నుంచి ఉత్తర కొరియాలో సుమారు రెండు మిలియన్ల మంది ప్రజలు వింత జ్వరంతో బాధపడుతున్నారు. మే 12 న, ఉత్తర కొరియా మొదటిసారిగా తమ దేశంలో కరోనావైరస్ కేసులు వచ్చినట్లు ప్రకటించింది. దీని తరువాత, కిమ్ జోంగ్ దేశం మొత్తం లాక్డౌన్ విధించారు.

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం