AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G7 meeting: జీ7 సదస్సులో కరోనా కలకలం.. పాల్గొనేందుకు వెళ్లిన ఇద్దరు భారత ప్రతినిధులకు పాజిటివ్

COVID-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా సెకండ్ వేవ్

G7 meeting: జీ7 సదస్సులో కరోనా కలకలం.. పాల్గొనేందుకు వెళ్లిన ఇద్దరు భారత ప్రతినిధులకు పాజిటివ్
JAISHANKAR
Shaik Madar Saheb
|

Updated on: May 05, 2021 | 3:46 PM

Share

COVID-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. జీ 7 స‌ద‌స్సులో పాల్గొనేందుకు లండ‌న్ వెళ్లిన భార‌త ప్ర‌తినిధుల్లో ఇద్ద‌రికి క‌రోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తినిధుల బృందంలోని స‌భ్యులంతా సెల్ఫ్ ఐసొలేష‌న్‌లో ఉన్న‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వం బుధ‌వారం వెల్లడించింది. జీ 7 గ్రూప్‌లో భార‌త్ స‌భ్య దేశం కాదు.. అయిన‌ప్ప‌టికీ లండ‌న్‌‌లో జ‌రిగే ఈ స‌ద‌స్సుకు భార‌త్‌తోపాటు ఆస్టేల్రియా, ద‌క్షిణ ఆఫ్రికా, ద‌క్షిణ కొరియా దేశాల‌ను బ్రిట‌న్ ఆహ్వానించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తో కూడిన భార‌త‌ ప్ర‌తినిధుల బృందం లండ‌న్‌కు వెళ్లింది.

మ‌రోవైపు క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తినిధుల‌కు ప్ర‌తి రోజు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార‌త ప్ర‌తినిధుల్లో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వారంద‌రినీ సెల్ఫ్ ఐసొలేష‌న్‌లో ఉంచిన‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వం తెలిపింది. భార‌త ప్ర‌తినిధులు వ‌ర్చువ‌ల్‌గా స‌ద‌స్సులో పాల్గొంటార‌ని పేర్కొంది. అయితే కేంద్ర మంత్రి జైశంక‌ర్‌కు క‌రోనా సోక‌లేద‌ని తెలిపింది. కాగా ఆయ‌న బ్రిట‌న్ అంత‌ర్గ‌త మంత్రితో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైన‌ట్లు స్థానిక‌ మీడియా ప్రకటించింది. కరోనా కలకలం నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్ వర్చువల్ ద్వారా జీ7 సమావేశంలో పాల్గొన్నారు.

Also Read:

Kamal Hassan Review: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో

Petrol and Diesel Rates: ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పెట్రో ధరల బాదుడు షురూ.. అసలేం జరుగుతోందంటే..!

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!