AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

44 ఏళ్ళ పాటు డైరెక్టర్ గా బిల్ గేట్స్ ప్రస్థానం.. కరోనాపై పోరాటమే ఇక ధ్యేయం

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చివరకు తప్పుకున్నారు. 1976 మార్చి 13 న తన సంస్థ పబ్లిక్ కంపెనీ అయినప్పటి నుంచీ (అప్పట్లో ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే) డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతూ వచ్చారు.

44 ఏళ్ళ పాటు డైరెక్టర్ గా బిల్ గేట్స్ ప్రస్థానం.. కరోనాపై పోరాటమే ఇక ధ్యేయం
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 11:47 AM

Share

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చివరకు తప్పుకున్నారు. 1976 మార్చి 13 న తన సంస్థ పబ్లిక్ కంపెనీ అయినప్పటి నుంచీ (అప్పట్లో ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే) డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతూ వచ్చారు. సరిగ్గా 2020 మార్చి 13 నే ఆయన తప్పుకోవడం విశేషం. తన నిర్ణయానికి దారి తీసిన కారణాలను ఆయన క్లుప్తంగా లింక్డ్ ఇన్ పోస్టులో వివరించారు. ‘బెర్క్ షైర్ హాథ్ వే బోర్డు నుంచి వైదొలగుతున్నా.. గ్లోబల్ హెల్త్, (ఆరోగ్యం), అభివృధ్ది, విద్య వంటి రంగాలకు ధార్మిక కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. అలాగే క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) పై నా ఎంగేజ్ మెంట్స్ పెరుగుతున్న కారణం కూడా ఒకటి’ అని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్-19 (కరోనా) పై ప్రపంచ దేశాలు పోరాడుతున్న సమయంలో బిల్ గేట్స్ తీసుకున్న ఈ టైమింగ్ కూడా చెప్పుకోదగినది. డైరెక్టర్ల బోర్డు నుంచి తను వైదొలగున్నంతమాత్రాన..మైక్రో సాఫ్ట్  సంస్థకు దూరం కావడంలేదని, తన జీవిత కాలంలో ఈ సంస్థ ప్రస్థానం అతి ముఖ్యమైనదని ఆయన అన్నారు. సత్య నాదెళ్లకు సదా నేను సహకరిస్తూనే ఉంటానని, అలాగే డైరెక్టర్ల బోర్డుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

సీఈఓ సత్య నాదెళ్ల  నేతృత్వంలో మైక్రో సాఫ్ట్ ట్రిలియన్ డాలర్ల కంపెనీగా కొనసాగుతోంది. బిల్ గేట్స్ హయాంలో ఎన్నడూ చేరుకోని   మార్కెట్ వాల్యూని సత్య హయాంలో చేరుకుంది. అయితే డైరెక్టర్ల బోర్డు నుంచి బిల్ గేట్స్ వైదొలగడం సంస్థకు కొంత హానికరమేనన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. 2008 లో ఫుల్ టైమ్ డైరెక్టర్ హోదాను పక్కన పెట్టినప్పటికీ.. తన సంస్థను అగ్ర స్థానంలో నిలపడానికి గెట్ చేసిన కృషి అపారం. కంపెనీ షేర్లలో ఆయనకు ఇప్పటికీ 1.3 శాతం వాటాలున్నాయి. ఇవి సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైనవి. కాగా; కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాలు జరుపుతున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములవుతామని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఇందుకు 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణకు పరిశోధకులు చేస్తున్న కృషికి  తమ సహాయం ఉంటుందని, వ్యాక్సీన్ తయారీకి అయ్యే ఖర్చును తాము ప్రకటించిన విరాళం నుంచి అందుకోవచ్ఛునని ఈ సంస్థ స్పష్టం చేసింది.

Follow Us
ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం
రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం
టీమిండియాకు భారంగా అభిషేక్? తప్పించే సాహసం చేయని గంభీర్, సూర్య..!
టీమిండియాకు భారంగా అభిషేక్? తప్పించే సాహసం చేయని గంభీర్, సూర్య..!
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. కొత్త ఇళ్లకు..
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. కొత్త ఇళ్లకు..
అరుదైన సువాసన.. ఆకాశాన్ని తాకిన ధర! ప్రపంచంలోనే ఖరీదైన సెంట్‌
అరుదైన సువాసన.. ఆకాశాన్ని తాకిన ధర! ప్రపంచంలోనే ఖరీదైన సెంట్‌
థియేటర్లలో 300 రోజులు ఆడిన సినిమా.. అసలైన బ్లా్క్ బస్టర్..
థియేటర్లలో 300 రోజులు ఆడిన సినిమా.. అసలైన బ్లా్క్ బస్టర్..
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి..
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి..
టీ20ఐల్లో నంబర్ 1 ఓపెనర్ ఎవరు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
టీ20ఐల్లో నంబర్ 1 ఓపెనర్ ఎవరు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోలో ఉన్న నెంబర్‌ను కనిపెట్టండి!
మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోలో ఉన్న నెంబర్‌ను కనిపెట్టండి!
తిరుమల శ్రీవారి భక్తులకు ఊరట.. లడ్డూ విషయంలో కొత్త రూల్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు ఊరట.. లడ్డూ విషయంలో కొత్త రూల్స్..