AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తన 9 ఏళ్ల కవల కూతుర్ల నుంచి అద్దె వసూలు చేస్తోన్న తల్లి.. రీజన్ తెలిస్తే.. గ్రేట్ మదర్ అనాల్సిందే ఎవరైనా..

పిల్లలని తల్లిదండ్రులు పెంచే విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. కొంత మంది తల్లిదండులు తాము పడిన కష్టాలు.. తమ పిల్లలు పడకూడదు అంటూ అతి గారాబంగా పెంచుతారు. మరికొందరు.. తమ పిల్లలకు జీవితం అంటే తెలియాలని కష్ట సుఖాలు తెలియజేస్తూ పెంచుతారు. అయితే ఇప్పుడు ఒక తల్లి తన 9 ఏళ్ల కవల కూతుర్ల నుంచి ఇంట్లో ఉంటున్నందుకు అద్దె వసూలు చేస్తున్న వార్త వైరల్ అవుతుంది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తల్లి ఇదంతా తన కూతురు మంచి కోసమే అని చెబుతుంది.

Viral News: తన 9 ఏళ్ల కవల కూతుర్ల నుంచి అద్దె వసూలు చేస్తోన్న తల్లి.. రీజన్ తెలిస్తే.. గ్రేట్ మదర్ అనాల్సిందే ఎవరైనా..
Viral NewsImage Credit source: social media
Surya Kala
|

Updated on: Sep 12, 2025 | 9:55 AM

Share

అమెరికాలోని అట్లాంటాలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ తన కవల కుమార్తెలు ఇంట్లో నివసిస్తున్నందుకు అద్దె వసూలు చేస్తుంది. ఇది మాత్రమే కాదు.. అద్దె సకాలంలో చెల్లించకపోతే.. ఆమె కుమార్తెలకు జరిమానా కూడా విధిస్తుంది. ఇదంతా వారి సంక్షేమం కోసమే చేస్తున్నానని ఆ మహిళ చెబుతోంది. ఎలాగో తెలుసుకుందాం.

జార్జియాకు చెందిన 38 ఏళ్ల లాటోయా వైట్‌ఫీల్డ్ తన 9 ఏళ్ల కవల కుమార్తెలు గ్రేస్ , ఆటమ్ లు తన ఇంట్లో నివసించడానికి అద్దె వసూలు చేస్తుంది. ఈ ప్రత్యేకమైన పద్ధతి వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, ఆమె కుమార్తెలకు డబ్బు విలువ, ఆర్థిక బాధ్యతను నేర్పించడం.

మిర్రర్ యుకె నివేదిక ప్రకారం.. టోయా కుమార్తెలు ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లాలని పదే పదే పట్టుబట్టడంతో ఇదంతా ప్రారంభమైంది. టోయా తన దగ్గర అంత డబ్బు లేదని వారికి వివరించినప్పుడు.. ఆ అమ్మాయిలు వెంటనే, “మీ జీతం ఇప్పుడే అందింది” అని అన్నారు. ఇది విన్న టోయా.. తన పిల్లలకు డబ్బు విలువ అస్సలు అర్థం కాలేదని గ్రహించింది. దీని తర్వాతే ఆమె తన కుమార్తెలకు జీవిత పాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది.

ఇవి కూడా చదవండి

‘ప్లే మనీ’ వ్యవస్థ దీని తరువాత టోయా తన కూతుళ్లకు ఒక నకిలీ అద్దె ఒప్పందం .. ‘ప్లే మనీ’ వ్యవస్థను సృష్టించింది, తద్వారా వారు జీవితాన్ని బాధ్యతగా భావించడం మొదలు పెట్టారు. ఆమె ప్రతి వారం తన కూతుళ్లకు చిన్న చిన్న పనులు చేసినందుకు జీతంగా కొంత డబ్బు ఇస్తుంది. ఆ డబ్బు నుంచి వారు ఇంటి అద్దె, విద్యుత్, వై-ఫై, గ్యాస్ వంటి ఖర్చులను చెల్లించాలి.

జరిమానాలు, బోనస్‌లు ఆమె తన కూతుళ్లతో ఇంటిని మురికి చేసినా లేదా సమయానికి అద్దె చెల్లించకపోయినా జరిమానా విధించబడుతుందని కూడా చెప్పింది. అంతేకాదు పిల్లలని ఇంటి నుండి కూడా వెళ్లగొట్టే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు గ్రేస్, ఆటమ్ లు మంచి మార్కులు తెచ్చుకున్నా, బాగా ప్రవర్తించినా, తమ తగాదాలను స్వయంగా పరిష్కరించుకున్నా.. తల్లి వారికి బోనస్‌లు కూడా ఇస్తుంది. ఈ పద్ధతి తన కూతుళ్లకు డబ్బు విలువను అర్థం చేసుకోవడం నేర్పుతుందని ఆ మహిళ నమ్ముతుంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..