AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నర్సరీ స్కూల్ ఫీజులు రూ. 2.5 లక్షలు..! జోక్‌ కాదు ఈ ప్రూఫ్‌ చూడండి..

హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల నర్సరీ విద్యార్థులకు రూ.2.5 లక్షల ఫీజు విధించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యూషన్, అడ్మిషన్, ఇతర ఫీజుల తో కలిపి మొత్తం రూ.2.5 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.

నర్సరీ స్కూల్ ఫీజులు రూ. 2.5 లక్షలు..! జోక్‌ కాదు ఈ ప్రూఫ్‌ చూడండి..
Nursery Students
SN Pasha
|

Updated on: Aug 01, 2025 | 10:07 PM

Share

మంచి విద్య కోసం ఎంత ఖర్చు చేసినా అయినా పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇటీవలి రోజుల్లో, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతుంది. ఫీజుల సాకుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఏటా పెరుగుతున్నాయి. తాజాగా నర్సరీ విద్యార్థికి ఏకంగా రూ.2.5 లక్షల ఫీజుకు సంబంధించిన రసీదు వైరల్‌ అవుతోంది. అది కూడా మన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌ ఇంత భారీ ఫీజు కేవలం నర్సరీ విద్యార్థులకు వసూలు చేస్తోంది.

@talk2anuradha అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫొటోలో నర్సరీ పిల్లల ఫీజుల గురించి ప్రస్తావించబడింది. 2025-26 విద్యా సంవత్సరానికి నర్సరీ పిల్లలకు వార్షిక పాఠశాల ఫీజులు రూ.2.5 లక్షలు. ABCD నేర్చుకోవడానికి నెలకు రూ.21,000 చెల్లించాలని శీర్షిక చెబుతోంది. పోస్ట్‌లో పాఠశాల ఫీజుల గురించి వివరంగా ప్రస్తావించబడింది. ట్యూషన్ ఫీజు: రూ.47,750, అడ్మిషన్ ఫీజు: రూ.5,000, ప్రారంభ ఫీజు: రూ.12,500, తిరిగి చెల్లించదగిన డిపాజిట్: రూ.10,000 అని ఉంది.

మొత్తం కలిపి నాలుగు వాయిదాలలో మొత్తం రూ.2,51,000 ఫీజు చెల్లించాలి. మిగిలిన ఫీజు ప్రీ-ప్రైమరీ II: రూ.2,72,400, తరగతులు I నుండి II వరకు: రూ.2,91,460, తరగతులు III నుండి V వరకు: రూ.3,22,350 ఫీజులు ఉన్నాయి. జూలై 30న ఈ ఫొటో పోస్ట్‌ చేశారు. దీనిపై తల్లిదండ్రులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి