AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్

జబర్దస్త్

ఈ కామెడీ షో గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ప్రముఖ ఛానెల్ ఈ టీవీలో ప్రసార మయ్యే ఈ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా నిలిచింది జబర్దస్త్. ఈ షోను మొదట ఈటీవీలో ఫిబ్రవరి 7, 2013 న ప్రారంభించారు. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తెలుగు సినిమా నటులు నాగేంద్రబాబు, రోజా సెల్వమణిలు వ్యవహరించారు. అలాగే రష్మీ గౌతమ్ ఈ షోకు యాంకర్ గా చేసింది. ఆతర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ మరో ప్రోగ్రామ్ కూడా మొదలు పెట్టారు. ఈ షోకు అనసూయ భరద్వాజ్ యాంకర్ గా చేశారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ షో పుణ్యమా అని ఇండస్ట్రీకి చాలా మంది కమెడియన్స్ దొరికారు. అలాగే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి వారు హీరోలు గా కూడా సినిమాలు చేశారు. అలాగే వేణు, ధనరాజ్ దర్శకులుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వేణు బలగం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.

ఇంకా చదవండి

Rithu Chowdary : ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను.. కానీ నేను సంపాదించింది ఇంతే’: రీతూ చౌదరి

జబర్దస్త్ తో సహా పలు టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. అలాగే యూట్యూబ్ వీడియోలతోనూ నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో రీతూ చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.

Dhanraj: శ్రీరామనవమి రోజున క్షమాపణలు చెప్పిన జబర్దస్త్ ధన్‌రాజ్.. ఏం జరిగిందంటే?

శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 06) రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ పండగను విశేషంగా జరుపుకొన్నారు. అయితే ఈ శ్రీరామనవమి పర్వదినాన జబర్దస్త్ నటుడు ధన్ రాజ్ అందరికీ క్షమాపణలు చెప్పాడు. ఎందుకంటే?

Tollywood: ఈ ఫొటోలోని మిమిక్రీ ఆర్టిస్టును గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో.. భార్య కూడా ప్రముఖ నటినే

ఇతను హీరోగా నటించిన మొదటి సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. అప్పటివరకు ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ సరదాగా కనిపించే ఈ నటుడు సినిమాలో మాత్రం తన అద్భుత నటనతో ఏడిపించేశాడు. సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Anasuya Bharadwaj: ఆధ్యాత్మిక యాత్రలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి కాశీలో ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

సినిమాలు, టీవీ షోలతో బిజి బిజీగా ఉండే అనసూయ వారణాసి వెళ్లింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. అలాగే వారణాసి వంటకాలను రుచి చూసింది. షాపింగ్‌ కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Jabardasth- Raising Raju: ‘చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశా’.. కన్నీళ్లు తెప్పించిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రైజింగ్ రాజు ఒకరు. మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యారు. హైపర్ ఆదితో కలిసి టీమ్ లీడర్‌గా బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.

OTT Movie: కన్న తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? ఓటీటీలోకి లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. అయితే ఇటీవల కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ నెల రోజుల గడవకముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

Yadamma Raju: గ్రాండ్‌గా యాదమ్మ రాజు కూతురి నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారంటే? ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ కమెడియన్‌ యాదమ్మరాజు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. అతని భార్య స్టెల్లా రాజ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కూతురి బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు యాదమ్మ రాజు దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

Sudigali Sudheer: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్.. అసలు ఏమైంది? అభిమానుల్లో ఆందోళన

ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపైనా మెరుస్తున్నాడు సుడిగాలి సుధీర్. యాంకర్ గా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ ను హోస్ట్ చేస్తోన్న అతను హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని తెలుస్తోంది.

Rashmi Gautam: ఆస్పత్రి బెడ్‌పై జబర్దస్త్ యాంకర్ రష్మీ.. షాక్‌లో ఫ్యాన్స్.. ఏమైందంటే?

ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఆస్పత్రి పాలైంది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ అందాల యాంకరమ్మ. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Tollywood: ఒకప్పుడు స్మితా సబర్వాల్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా?

తెలంగాణాలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాడీ నటుడు. చిన్నప్పుడు చదువుకుంటూనే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. మిమిక్రీ కూడా వంట బట్టించుకున్నాడు. ఇదే క్రమంలో పలు టీవీ షోల్లో పాల్గొని సత్తా చాటాడు.