AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ లీగ్‌లో మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. తొలి సీజన్ అంటే, 2008లో ఆ జట్టు ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చెన్నై జట్టు అద్భుతమైన ప్రదర్శన 2009లో కొనసాగింది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో మూడో స్థానంలో నిలిచింది. ఇక 2010, 2011లో ధోనీ సేన ప్రదర్శన అద్భుతంగా మారింది. వరుసగా రెండు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపాల్‌గా ఉన్న ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడ్డాడు. ఆ ఏడాది చెన్నై జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2014లో ప్లేఆఫ్‌లు, 2015లో మళ్లీ ఫైనల్స్‌కు చేరిన సీఎస్‌కేపై ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్‌తో పాటు సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు నిషేధం విధించింది. 2018లో జట్టు పునరాగమనం చేసి మూడోసారి టైటిల్‌ను గెలుచుకుంది. 2019లో ధోనీ సేన ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.

2020లో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా సీఎస్‌కే ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 2021లో గత సీజన్‌లో ప్రదర్శనను మరిచిపోయిన చెన్నై అద్భుత ఆట ఆడి నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా ఏమీ చూపించలేకపోయింది. ట్రోఫీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఇక 2023లో మరోసారి ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది. ఎందుకంటే ఈ జట్టులో అంతా ఏజ్ బార్ ప్లేయర్స్ ఉన్నారు.

ఇంకా చదవండి

IPL 2027 Trading: చెన్నై సూపర్ కింగ్స్‌లో హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!

IPL 2027 Trading: ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరుచుకునే సమయంలో ఇలాంటి సంచలన వార్తలు రావడం సహజమే. సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ఈ వార్తలను ఖండించినప్పటికీ, మెగా వేలం మరియు ట్రేడింగ్ ప్రక్రియ ముగిసే వరకు హార్దిక్ పాండ్యా భవిష్యత్తు ఎటు వైపు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు కాబట్టి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. ధోనీ సేనలో చేరి రాత మార్చుకున్న స్టార్ క్రికెటర్లు వీళ్లే..!

IPL Cricket News: ఒక ఆటగాడిని ఎలా వాడుకోవాలో, అతనిలో ఉన్న అసలైన ప్రతిభను ఎలా బయటకు తీయాలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి తెలిసినంతగా బహుశా మరే జట్టుకు తెలియదేమో. ముంబై ఇండియన్స్ వంటి బలమైన జట్టులో రాణించలేకపోయిన క్రికెటర్లు సైతం చెన్నై జట్టు వాతావరణంలోకి అడుగుపెట్టగానే చాంపియన్లుగా మారిపోతుంటారు.

హార్దిక్ పాండ్యాకు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి విడిపోవడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో, ఆయన తదుపరి ప్రయాణం ఎటువైపు సాగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ధోనీ నీడలో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపడతారా? లేక కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో చేరి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

ఐపీఎల్ 2027లో విజేత ఎవరు.. ఆర్సీబీ ఫ్యాన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన ధోని..!

MS Dhoni: మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా కూల్‌గా ఎదుర్కొనే ధోనీ.. బయట అభిమానులతో కూడా అంతే ఆప్యాయంగా నడుచుకుంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రత్యర్థి జట్టు అభిమాని తన ముందే సవాల్ విసిరినా, దాన్ని చిరునవ్వుతో స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటుకున్న ‘తలా’ నిజంగానే అందరి మనసు గెలుచుకున్నారు. మరి వచ్చే సీజన్‌లోనైనా ధోనీ బ్యాట్ పట్టి సీఎస్‌కేను మళ్లీ విజయపథంలో నడిపిస్తారో లేదో చూడాలి..!

ఫ్రాంచైజీల వల్ల కాలే.. హ్యాట్రిక్ ట్రోఫీలతో ఐపీఎల్ హిస్టరీని మార్చేసిన ముగ్గురు.. తోపులకే తోపులు వీళ్లు.!

Consecutive IPL Titles: క్రికెట్ ప్రపంచంలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడైతేనే ఇలాంటి అరుదైన రికార్డులు సాధ్యమవుతాయి. ఐపీఎల్ లాంటి అత్యంత కఠినమైన లీగ్‌లో ఏకంగా మూడు విభిన్న సీజన్లలో వరుసగా చాంపియన్ జట్లలో సభ్యులుగా ఉండటం ఈ ముగ్గురు ఆటగాళ్లకు దక్కిన అరుదైన గౌరవమనే చెప్పాలి.

Watch : ఆర్‌సీబీ చేతిలో ఓటమి తర్వాత ధోనీ బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడా.. ఆ వైరల్ వీడియో నిజమేనా ?

Watch : కెప్టెన్ కూల్‎గా పేరు తెచ్చుకున్న ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ కామెంటేటర్, ప్రజెంటర్ తనయ్ తివారీ ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షో ది రణ్‌వీర్ షో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో RCB చేతిలో చెన్నై ఓడిపోయిన తర్వాత ధోనీ తట్టుకోలేక బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడని ఆ వీడియోలో ఉంది.

  • Rakesh
  • Updated on: May 28, 2026
  • 5:45 pm

IPL 2026: ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న సీఎస్కే బుడ్డోడి లెక్కలు..!

Kartik Sharma Salary: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసినప్పటికీ, ఆ జట్టు కొనుగోలు చేసిన యువ ఆటగాడు కార్తీక్ శర్మ మాత్రం వార్తల్లో నిలిచాడు. టోర్నమెంట్‌లో భారీ ధరకు అమ్ముడైన ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్, ఈ సీజన్‌లో చేసిన ఒక్కో పరుగుకు చెన్నై ఫ్రాంచైజీ ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

CSK: నీ సేవలకి చాలు.. సంచలన నిర్ణయంతో సారథికి షాకిచ్చేందుకు సిద్ధమైన చెన్నై..?

CSK New Captain IPL 2027: సంచలన నిర్ణయాలకు, దీర్ఘకాలిక ప్రణాళికలకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పెట్టింది పేరు. ధోనీ హయాం నుంచి జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చే సీఎస్‌కే.. ఈసారి మాత్రం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కఠిన నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తోంది.

Video: ఐపీఎల్ సీజన్‌ నుంచి CSK ఇంటికెళ్లడంతో.. ధోని చూడండి ఏం చేస్తున్నాడో!

ఐపీఎల్ 2026 ముగిసిన అనంతరం భారత మాజీ కెప్టెన్ ధోని తన స్వస్థలం రాంచీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను నడుపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ధోనీ మళ్లీ తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు.

  • SN Pasha
  • Updated on: May 23, 2026
  • 11:58 am

IPL 2027: ఘోర పరాజయంతో చెన్నై షాకింగ్ డిసిషన్.. ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు గుడ్ బై..?

ఐపీఎల్ 2026 సీజన్ లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం అత్యంత నిరాశాజనకంగా ముగిసింది. వరుసగా మూడో ఏడాది కూడా ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమై అభిమానుల గుండెల్ని పగల్గొట్టింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సీఎస్కే, రాబోయే సీజన్ కోసం జట్టును ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ముగ్గురు కీలక ఆటగాళ్లను వదులుకోనుంది.

MS Dhoni Salary: ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?

MS Dhoni IPL Salary: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కోట్లల్లో పారితోషికాన్ని అందుకున్నాడు. గాయాల కారణంగా మైదానంలోకి దిగకపోయినా, అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధనలు, బీమా ఒప్పందాల ప్రకారం ఈ వేతనం ఆయనకు పూర్తిగా లభిస్తుంది.

IPL 2026 : చెన్నైకి డబుల్ షాక్.. ఐపీఎల్ నుంచి ఔట్.. కెప్టెన్ సహా టీమ్ మొత్తానికి బీసీసీఐ భారీ జరిమానా

IPL 2026 : గుజరాత్ చేతిలో 89 పరుగుల తేడాతో ఓడి ఐపీఎల్ 2026 నుంచి చెన్నై అవుట్ అవ్వడమే కాకుండా, స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రుతురాజ్‌కు రూ. 24 లక్షల జరిమానా పడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది.

  • Rakesh
  • Updated on: May 22, 2026
  • 12:13 pm