AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన శేజల్‌ ఎవరు..? ఆమె ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణలు ఏంటి..?

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధించారంటూ ఇన్నాళ్లు ఆందోళనకు దిగిన శేజల్.. ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేసింది. జాతీయ స్థాయిలో ఓ వైపు ఫిర్యాదులు చేస్తూ.. మరోవైపు ధర్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సూసైడ్ అటెంప్ట్ కలకలం రేపింది.

Delhi తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన శేజల్‌ ఎవరు..? ఆమె ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణలు ఏంటి..?
Bodapati Sejal
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2023 | 8:38 PM

Share

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధిస్తున్నారంటూ కొద్దిరోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పరుగుల మందు తాగారామె. గమనించిన స్తానికులు శేజల్‌ను ఆసుపత్రికి తరలించారు. దుర్గం చిన్నయ్య తనను మానసికంగా , లైంగికంగా వేధించారని శేజల్ ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ భవన్, జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశారు. అయితే ఉన్నట్టుండి శేజల్ సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది.

దుర్గం చిన్నయ్య అమ్మాయిలను పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని అప్పట్లో శేజల్​ఆరోపించడం సంచలనంగా మారింది. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించారని ఆరోపించారు. అమ్మాయిలను ట్యాబ్లెట్ అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో చేసిన వాట్సాప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు, అమ్మాయిల ఫోటోలు రిలీజ్ చేశారు. అలాగే వేధింపులకి సంబంధించి ఆడియోలను కూడా విడుదల చేశారు.

శేజల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే చిన్నయ్య.. తనకెలాంటి సంబంధం లేదన్నారు. చాలామంది రైతుల దగ్గర్నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి శేజల్ అండ్ కోం మోసం చేసిందన్నారు. బాధిత రైతులు తనను సంప్రదించడంతో నిర్వాహకుల వ్యవహరాన్ని పోలీసుల దృష్టికి మాత్రమే తీసుకెళ్లానని వివరణ ఇచ్చారు. అయితే ఢిల్లీలో ఆల్ ఆఫ్ సడెన్‌గా శేజల్ ఆత్మహత్యాయత్నం చేయడం ఈ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పురుగుల మందు తాగిన ప్రాంతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. ప్రస్తుతం ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో శేజల్‌కి చికిత్స కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం