GO 317 Controversy: తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన రేవంత్‌ సర్కార్

తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది రేవంత్‌ సర్కార్. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి.. ప్రాబ్లమ్‌ క్లియర్‌ చేయడంలో స్పీడ్‌ పెంచింది. ఇక జీవో 317పై ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సబ్‌ కమిటీ, మరోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.

GO 317 Controversy: తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన రేవంత్‌ సర్కార్
Cabinet Sub Committee
Follow us

|

Updated on: Jul 11, 2024 | 9:42 PM

తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది రేవంత్‌ సర్కార్. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి.. ప్రాబ్లమ్‌ క్లియర్‌ చేయడంలో స్పీడ్‌ పెంచింది. ఇక జీవో 317పై ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సబ్‌ కమిటీ, మరోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ 317 జీవోపై కమిటీ ఏం తేల్చింది..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది..?

ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్‌. అందులో భాగంగానే జీవో 317పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. జీవో317పై ఏర్పాటైన కేబినెట్‌ సబ్ కమిటీ, ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యింది. ఉద్యోగ సంఘాల నేతలతోనూ సమస్యల పరిష్కారానికి చర్చించింది. మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షన మరోసారి భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ సబ్‌ కమిటీ మెంబర్లుగా ఉన్నా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య లేదా భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడి అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి, వాటిని పరిశీలించిన తర్వాత తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో ఉద్యోగుల సమస్యలకు పూర్తిస్థాయిలో చెక్‌ పెడతామంటోంది కేబినెట్‌ సబ్ కమిటీ.

ఇక.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ప్రభుత్వం 2016లో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోన్లకు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు 2021 డిసెంబర్ 6న 317జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులు.. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్‌ ఎంచుకునే అవకాశం కల్పించింది. అయితే పోస్టింగ్‌ విషయంలో సీనియార్టీకి ప్రిపరెన్స్‌ ఇవ్వడం వివాదాస్పదం అయింది. సీనియర్లు డిమాండ్ ఉన్న చోటుకు వెళ్తే మిగతా వారికి అవకాశం ఉండదు. దాంతో.. సొంత జిల్లాలకు చెందిన వారైనప్పటికీ, కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు. ఫలితంగా.. ఉద్యోగుల ప్రమోషన్లు, పే స్కేల్స్ వంటి అంశాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు 317 జీవోని తీవ్రంగా వ్యతిరేకించారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విధుల కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్నే మార్చి వేశారంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ జిల్లాల్లో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రతిరోజూ ప్రయాణం చేయలేకపోతున్నామంటూ ఆందోళనలకు దిగారు. ఉద్యోగ సంఘాలకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. అధికారంలోకి వస్తే 317 జీవో బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.

ఆ మేరకు అధికారంలోకి రావడంతో 317 జీవోపై రేవంత్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తప్పకుండా సొంత జిల్లాలకు పంపిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానిలో భాగంగానే..317 జీవోపై కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. తాజాగా.. సమావేశమైన కమిటీ కీలక నిర్ణయాలు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..