కొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15 వేలు

Venkatrao Lella

Images: Pinterest

01 JUNE 2026

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనేది రూ.1 లక్ష కోట్ల పథకం. 1 ఆగస్టు 2025 నుండి 31 జూలై 2027 మధ్య 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడం దీని లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది.

ప్రారంభ తేదీ

ఇది మొదటిసారి ఉద్యోగంలో చేరే వారిని కవర్ చేస్తుంది. పార్ట్ A రూ. 1 లక్ష వరకు సంపాదించే ఉద్యోగులను కవర్ చేస్తుంది. అయితే పార్ట్ B కనీసం ఆరు నెలల పాటు 2–5 అదనపు ఉద్యోగులను నియమించుకుని కొనసాగించే యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తుంది

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు

మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల మూల వేతనానికి సమానమైన రూ.15 వేల వరకు ఒకేసారి ప్రోత్సాహకం రెండు వాయిదాలలో చెల్లించబడుతుంది

ఉద్యోగులకు ప్రయోజనాలు

ఈ పథకం రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. తయారీ కంపెనీలకు దీనిని నాలుగేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది

చెల్లుబాటు

ఉద్యోగులు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా UMANG యాప్ ద్వారా తమ UAN నంబర్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చు. యజమానులు ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR)ను ఫైల్ చేయాలి మరియు ఇప్పటికే ఉన్న మరియు కొత్త ఉద్యోగులందరి కోసం UMANG యాప్ ద్వారా UANలను తెరవాలి

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఈపీఎఫ్‌వోలో తొలిసారి నమోదు అయినవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. జీతం నెలకు రూ. లక్షలోపు మాత్రమే ఉండలి. ఇక ఉద్యోగం కల్పించినందుకు కంపెనీలకు కూడా ప్రోత్సాహకం అందిస్తుంది

ఈపీఎఫ్‌లో తొలిసారి నమోదైతే..

ఇక ఉద్యోగి ఒకే కంపెనీలో కనీసం ఆరు నెల పాటు పని చేసి ఉండాలి. ఈపీఎఫ్‌వో అకౌంట్ ఓపెన్ చేయగానే ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ప్రత్యేకంగా ఇందుకోసం దరకాఖాస్తు చేసుకోల్సిన అవసరం లేదు.

6 నెలల పాటు ఒకే కంపెనీలో

యూఏఎన్ నెంబర్ ఆధారంగా ప్రభుత్వం నేరుగా లబ్దిదారుడి అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తుంది. ఒకవేళ మీ అకౌంట్లో పడకపోతే కంపెనీ హెచ్‌ఆర్‌ను కలిసి ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

నేరుగా అకౌంట్లోకి బదిలీ