Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలు మీకోసం..

Hyderabad: హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో ట్రాక్ నుండి..

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలు మీకోసం..
Hmwssb
Follow us

|

Updated on: Aug 01, 2021 | 10:11 PM

Hyderabad: హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో ట్రాక్ నుండి చర్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. దాంతో ఒక రోజు పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. 04-08-2021 తేదీన అంటే బుధవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు 05-08-2021 తేదీన అంటే గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ జంక్షన్ పనులు జరుగనున్నాయి. దాంతో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా ఈ క్రింతి ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే.. 1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మహింద్ర హిల్స్. 7.ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు. 9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.

నీటి సరఫరాలో అంతరాయం కలుగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు అధికారులు కోరారు.

Also read:

ఆడపిల్లలకు అర్ధరాత్రి బీచ్ లో ఏం పని..?తల్లిదండ్రులకు బాధ్యత లేదా?-గోవా సీఎం:GOA CM Pramod Sawant Video.

Andhra Pradesh: టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం మరో టర్న్.. ఎమ్మెల్యే రాచమల్లు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం..

Tokyo Olympics: నిద్రలేచింది మహిళా లోకం..టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల కంటే మహిళలకే ఇప్పటివరకూ ఎక్కువ పతకాలు..ఆ లెక్క ఇలా..