AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: ‘నాన్నా.. ఉంగరం కూడా పోయింది.. నాకు భయమేస్తోంది’ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

వేలికున్న బంగారు ఉంగరం పోయిందనే మనస్తాపంతో డిగ్రీ విద్యార్ధిని తనువు చాలించింది. పోయిన ఉంగరం ఎంత వెదికినా దొరక్కపోవడంతో నాన్న మన్నించు అంటూ ఉత్తరం రాసి ఇంట్లోనే ఉరివేసుకుని కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లాలో..

Warangal: 'నాన్నా.. ఉంగరం కూడా పోయింది.. నాకు భయమేస్తోంది' డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Warangal Crime News
Srilakshmi C
|

Updated on: Mar 29, 2023 | 9:22 AM

Share

వేలికున్న బంగారు ఉంగరం పోయిందనే మనస్తాపంతో డిగ్రీ విద్యార్ధిని తనువు చాలించింది. పోయిన ఉంగరం ఎంత వెదికినా దొరక్కపోవడంతో నాన్న మన్నించు అంటూ ఉత్తరం రాసి ఇంట్లోనే ఉరివేసుకుని కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం (మర్చి 28) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఉగాది పండగకు హేమలతారెడ్డి మార్చిన 20న ఇంటికొచ్చింది. ఈక్రమంలో చేతికున్న పావుతులం గోల్డ్‌ రింగ్‌ బుధవారం నాడు హేమలత ఎక్కడో జారవిడుచుకుంది. ఇల్లంతా వెతికినా దొరక్కపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. 6 నెలల క్రితం మెడలోని గోల్డ్‌ చైన్‌ కూడా పోగొట్టుకున్నానని, ఇప్పుడు ఉంగరం కూడా పోవడంతో తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో సూసైడ్‌ లెటర్ రాసి ఇంట్లోనే చున్నీతో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది.

పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తలుపులు లోపల్నుంచి గడిపెట్టి ఉండటంతో అనుమానం కలిగింది. దీంతో బలంగా తలుపులు తెరిచి ఇంట్లోకెళ్లి చూడగా ఉరి వేలాడుతున్న కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి ఫోన్‌తోపాటు, సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగదీష్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?