AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదు.. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టు సూటి ప్రశ్న

పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తర్వాత టీఎస్‌పీఎస్సీ పేరు మారుమోగుతోంది. ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా గ్రూప్‌ 1 పరీక్ష విషయంలో టీఎస్‌పీఎస్సీని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించినా వివాదాలు తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణలో తప్పిదాలు...

TSPSC: అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదు.. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టు సూటి ప్రశ్న
TSPSC
Narender Vaitla
|

Updated on: Jun 22, 2023 | 5:10 PM

Share

పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తర్వాత టీఎస్‌పీఎస్సీ పేరు మారుమోగుతోంది. ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా గ్రూప్‌ 1 పరీక్ష విషయంలో టీఎస్‌పీఎస్సీని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించినా వివాదాలు తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణలో తప్పిదాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకుండా పరీక్ష నిర్వహించారని అభ్యర్థులు పిటిషన్‌లో తెలిపారు. ఓఎంఆర్‌ షీట్‌పై అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్‌, ఫొటో లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ అంశంపై గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నంబరు, ఫోటో లేకపోవడంపై హైకోర్టు ప్రశ్నించింది. అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్పీఎస్సీని సూటిగా ప్రశ్నించింది. పరీక్షల్లో అక్రమాల నిరోధంలో కీలక అంశాలను విస్మరించారని వ్యాఖ్యానించింది.

దీంతో దీనికి టీఎస్‌పీఎస్సీ బదులిస్తూ.. బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని వివరణ ఇచ్చింది. మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us