AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet: నెత్తురోడిన రహదారి.. ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి, 8మందికి తీవ్రగాయాలు

Siddipet: వీరంతా సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు.. 11 మంది విద్యార్థులు వారికి సంబంధించి పరీక్షలు రాయడానికి కరీంనగర్ లోని తిమ్మాపూర్ కి ప్రైవేటు వాహనం క్వాలిస్ ని తీసుకొని వెళ్లారు. పరీక్షలంతా సజావుగా రాసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం పట్టారు. రోడ్డు ప్రయాణమంతా సాఫీగా సాగింది. మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనగా..

Siddipet: నెత్తురోడిన రహదారి.. ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి, 8మందికి తీవ్రగాయాలు
Road Accident
P Shivteja
| Edited By: |

Updated on: Sep 12, 2023 | 7:35 PM

Share

సిద్దిపేట,సెప్టెంబర్12: ఎన్నో కలలతో భవిష్యత్తును ఊహించుకున్న విద్యార్థులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఊహించని రోడ్డు ప్రమాదం ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇసుక లారీ రూపంలో మృత్యువు ముగ్గురు విద్యార్థులను కబలించింది..ఒకే కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి..తోటి మిత్రులందరు దిగ్భ్రాంతికి గురయ్యారు.. ముగ్గురు విద్యార్థులు ఒకేసారి మృత్యువాతపడటంతో వారి గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు ఆశులు భాషలు వీరంతా సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నా 11 మంది విద్యార్థులు వారికి సంబంధించి పరీక్షలు రాయడానికి కరీంనగర్ లోని తిమ్మాపూర్ కి ప్రైవేటు వాహనం క్వాలిస్ ని తీసుకొని వెళ్లారు. పరీక్షలంతా సజావుగా రాసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం పట్టారు.  రోడ్డు ప్రయాణం అంతా సురక్షితంగా చేరి ఇంటికి ఇంకొద్ది దూరంలో ఉన్నాము అన్న సమయంలో అనంతసాగర్ శివారులో ఆగి ఉన్న ఇసుక లారీని ఈ విద్యార్థులకు సంబంధించిన కాలీస్ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడివున్నవిద్యార్థులను స్థానికుల సాయంతో సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందజేస్తున్నారు.

మరణించిన విద్యార్థుల్లో ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి నితిన్ ,గ్రీష్మ ,నమత్రగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా మిత్రుల రోదనలతో శోక సముద్రంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదం విద్యార్థుల జీవితాలకు చరమగీతం పాడింది..

ఇవి కూడా చదవండి

సిద్ధిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం సమాచారం తెలిసిన మంత్రి మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. విద్యార్థుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!