AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. దేశంలోని ఆర్థిక పరిపుష్ఠి కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు

KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Minister KTR
Basha Shek
|

Updated on: Apr 23, 2022 | 1:49 AM

Share

తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. దేశంలోని ఆర్థిక పరిపుష్ఠి కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు. ‘2014లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 24 వేల రూపాయలు. ఈరోజు 2లక్షల 78వేల రూపాయలు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ 5లక్షల 6వేల కోట్లు..ఈరోజు 11 లక్షల 55వేల కోట్లు. ఈరోజు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న నాలుగో అతిపెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఈ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు దేశానికే తలమానికంగా మారాయి. మేం కూడా అప్పులు చేశాం. కానీ అవి ప్రజా సంక్షేమం కోసమే’ అని టీవ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కేటీఆర్‌.

వాటిని అప్పుల కింద చూడకూడదు.. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా బాగుచేయడానికి 85వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. దీనివల్ల పరిశ్రమలు అద్భుతంగా నడుస్తున్నాయి. ఫలితంగా సంపద పునరుత్పత్తి అవుతోంది. అదేవిధంగా 40వేల కోట్ల రూపాయలను మిషన్‌ భగీరథకు ఖర్చుపెట్టాం. దీనివల్ల ఇంటింటికీ పరిశుభ్రమైన నీరు అందించాం. అలాగే పరిశ్రమలకు సరిపడా నీటిని సరఫరా చేశాం. ఫలితంగా కలుషిత నీటి వ్యాధులు తగ్గిపోయాయి. ఇంకా కాళేశ్వరం, సీతారామ, పాలమూరు లాంటి ప్రాజెక్టులు కడుతున్నాం. ఉత్పాదక రంగంలో పెట్టిన డబ్బును పెట్టుబడి కింద చూడాలి గానీ అప్పుల కింద చూడకూడదు. ఇక తెలంగాణ డెబ్ట్‌ జీఎస్‌డీపీ రేటు 22శాతం. భారత దేశం డెబ్ట్‌ జీడీపీ రేటు 65 శాతం. అదేవిధంగా అమెరికా, జపాన్‌ల డెబ్ట్‌ జీడీపీ రేట్లు వరుసగా 108, 200 పర్సెంట్లుగా ఉన్నాయి. ఒక రూపాయి మారకం ఎంత ఎక్కువ జరిగితే అంత సంపద సృష్టించబడుతుంది. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది ఇదే’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. వరి కొనుగోలు, గవర్నర్‌ వ్యవహారం, నదీజలాల వాటా తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ప్రధాని మోడీ, బీజేపీ, రాష్ట్ర రాజకీయాలపై  ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూద్దాం.

Also Read:KTR: మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోం.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మంత్రి కేటీఆర్‌

KTR: మోడీ గాడ్సే భక్తుడని నేనూ అంటాను.. దమ్ముంటే జైల్లో పెట్టండి.. ప్రధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

అందాలతో రచ్చ చేస్తున్న రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోస్

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!