Telangana: లాక్‌డౌన్‌లో ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?

Lockdown - How to Apply E-Pass: తెలంగాణలో లాక్‌డౌన్‌ను మళ్లీ 10 రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తదితర అంశాలపై

Telangana: లాక్‌డౌన్‌లో ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?
Lockdown In Telangana
Follow us

|

Updated on: May 31, 2021 | 5:32 PM

Lockdown – How to Apply E-Pass: తెలంగాణలో లాక్‌డౌన్‌ను మళ్లీ 10 రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌‌రావు అధ్యక్షతన ఆదివారం సమావేశమైన మంత్రి మండలి జూన్ 9 వరకూ లాక్‌డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ఉన్న సడలింపు సమయాన్ని పెంచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సండలింపు ఉంటుందని.. దీంతోపాటు బయటకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లేందుకు 2 గంటల వరకూ సమయం ఇచ్చారు. అనంతరం 2 గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

అయితే.. వేరే రాష్ట్రాలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ ఇది వరకూ సూచించిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికి ఈ పాసులను జారీ చేస్తారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు పాస్‌లను జారీ చేస్తారు. అయితే ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకునే వారు వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి.. ➼ ముందుగా తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/ లో లాగిన్ కావాలి ➼ అనంతరం ఈ పాస్ e-Pass పై క్లిక్ చేయాలి ➼ మీరు నివసిస్తున్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి ➼ ఆ తర్వాత మీరు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది ➼ పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, ఏ పర్పస్ కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలతోపాటు.. ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ➼ ఫాంలను అప్‌లోడ్ చేయాలి. ➼ ఆతర్వాత కర్ఫర్మేషన్ వస్తుంది. ➼ ఆయా పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరు అవుతుంది. ➼ దానిని చూపించి రాష్ట్రం పరిధిలోని జిల్లాలకు ఆంక్షల సమయంలో ప్రయాణం చేయవచ్చు. అయితే.. లాక్‌డౌన్ సడలింపు సమయంలో ఈ పాస్ అవసరం లేదని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Lockdown: నిబంధనలు పాటించాల్సిందే.. లాక్‌డౌన్‌లో బయటకు వస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్

Model Rape: బాలీవుడ్‌లో కలకలం.. ప్రముఖ మోడల్‌పై అత్యాచారం.. 9 మంది సెలబ్రిటీలపై కేసు..

Juhi Chawla: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లక్కిన నటి జుహీ చావ్లా..