AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ గవర్నర్‌ ప్రతిభా అవార్డులు 2024 ప్రకటించిన రాజ్ భవన్.. పూర్తి జాబితా ఇదే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా వివిధ రంగాల్లో విశేష కృషి అందించిన సంస్థలు, వ్యక్తులకు గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి కూడా అవార్డులను ప్రధానం చేయనుంది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రధానం చేయనున్నారు. మొత్తం జాబితా ఈ కింద తెలుసుకోవచ్చు..

Telangana: తెలంగాణ గవర్నర్‌ ప్రతిభా అవార్డులు 2024 ప్రకటించిన రాజ్ భవన్.. పూర్తి జాబితా ఇదే
Governor's Awards For Excellence 2024
Srilakshmi C
|

Updated on: Jan 21, 2025 | 7:58 AM

Share

హైదరాబాద్‌, జనవరి 21: వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం తాజాగా ప్రకటించింది. ఈ అవార్డులకు మొత్తం 8 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. ఈ మేరకు జాబితాను వెల్లడించింది. కాగా వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం యేటా ప్రదానం చేస్తుంది. జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. మొత్తం నాలుగు రంగాలకు చెందిన వారికి ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నిర్ణయించారు.

పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను అందిస్తారు. గత ఐదేళ్లుగా ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారని అన్నారు. ఈ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు, జ్ఞాపిక ఇస్తారు.

అవార్డుకు ఎంపికైన వ్యక్తులు, సంస్థలు ఇవే

దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్‌ విజేత జీవాంజి దీప్తి, ప్రొఫెసర్‌ ఎం పాండురంగారావు – పిబి కృష్ణభారతికి సంయుక్తంగా అవార్డు ప్రధానం చేస్తారు. ఇక సంస్థల విషయానికొస్తే.. ధ్రువాంశు ఆర్గనైజేషన్‌, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్‌, సంస్కృతి ఫౌండేషన్‌.. నాలుగు సంస్థలు అవార్డుకు ఎంపికయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us