Telangana: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ వరాలు.. ఏపీలో మాత్రం అదే వార్

ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై రచ్చరచ్చ అవుతుంటే…. తెలంగాణ సర్కార్‌ మాత్రం టాలీవుడ్‌పై వరాల జల్లు కురిపించింది.

Telangana: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ వరాలు.. ఏపీలో మాత్రం అదే వార్
Telangana
Follow us

|

Updated on: Dec 24, 2021 | 5:30 PM

ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై రచ్చరచ్చ అవుతుంటే…. తెలంగాణ సర్కార్‌ మాత్రం టాలీవుడ్‌పై వరాల జల్లు కురిపించింది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్‌ రిక్వెస్ట్‌పై సానుకూలంగా రియాక్టయిన తెలంగాణ ప్రభుత్వం మూవీ టికెట్స్‌ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టికెట్‌ రేట్స్‌ ఎక్కడ ఎంత పెంచాలి? ఏ థియేటర్‌లో ఎంత ఉండాలి? నగరాల్లో ఎంత? పట్టణాల్లో ఎంత? ఇలా… డిటైల్డ్‌గా ప్రపోజల్స్‌ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు.

నాన్‌ ఏసీ థియేటర్లలో టికెట్‌ కనీస ధర రూ. 30గా.. గరిష్ఠ ధర రూ. 70గా ఫిక్స్ చేశారు. ఏసీ థియేటర్లలో కనిస ధర రూ.50, గరిష్ఠ ధర రూ.150గా నిర్ణయించింది. మల్టీప్లెక్సుల్లో కనిస ధర రూ.100, గరిష్ఠ ధర రూ.250గా నిర్ణయించింది. స్పెషల్ రిక్లైనర్ సీట్ల ధర రూ.300గా ఫిక్స్ చేశారు. వీటికి జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు.  ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు సినిమా టికెట్ల ధరలపై అదనంగా జీఎస్టీ వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 21 నుంచి పెంచిన టికెట్‌ ధరలు అమల్లోకి రానున్నాయి.

Also Read: కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు

 ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత