AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ రైతు గోస పేరుతో బీజేపీ పోరు దీక్ష… రాష్ట్ర సర్కార్‌పై మండిపడిన బండి సంజయ్

Telangana BJP: ‘‘ తెలంగాణ రైతు గోస - బిజెపి పోరు దీక్ష ’’లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ దీక్ష చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...

తెలంగాణ రైతు గోస పేరుతో బీజేపీ పోరు దీక్ష... రాష్ట్ర సర్కార్‌పై మండిపడిన బండి సంజయ్
Telangana Bjp
Sanjay Kasula
|

Updated on: May 24, 2021 | 3:44 PM

Share

‘తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష’ పేరుతో రైతు సమస్యలపై పోరాటాన్ని మొదలు పెట్టింది తెలంగాణ బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే దీక్ష చేస్తున్నామని అన్నారు.  కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతున్నా.. కొనుగోళ్లు జరగడంలేదన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. తడిసిన, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని కోరారు. తాలు, తరుగు పేరుతో రైతుల్ని వేధించడం ఆపాలని అన్నారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని, రైతుబంధు నిధులు విడుదల చేయాలన్నారు.

సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతే రాజు అని చెప్పిన సీఎం కేసీఆర్.. రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభం కాబోతుందని.. ఇంకెప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఒరిగింది ఏమిలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

‘‘ తెలంగాణ రైతు గోస – బిజెపి పోరు దీక్ష ’’లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కరోనా మార్గదర్శకాలు అనుసరిస్తూ దీక్ష చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు తమ తమ నివాసాల్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు.. విజయవాడ విడిచి వెళ్లొద్దని షరతు

Marriage in Plane: కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఘనంగా పెళ్లి.. ప్రొటోకాల్ మిస్.. ఆ తర్వాత ఏమైందంటే..?

WUHAN LABORATORY: చైనా మెడకు కరోనా ఉచ్చు.. వూహన్ ల్యాబే వైరస్ జన్మస్థలం! అమెరికా చేతిలో కీలక ఆధారం