AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ స్కూల్లో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌.. వారం రోజులు సెలవులు ప్రకటించిన MEO

తెలంగాణలో పాఠశాలలు తెరిచి 2 రోజులు కాలేదు.. అప్పుడే కరోనా కలవరం మొదలైంది. ఇప్పుడే పిల్లల్ని స్కూల్‌కి పంపించాలా..? వద్దా అని....

Telangana: ఆ స్కూల్లో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌.. వారం రోజులు సెలవులు ప్రకటించిన MEO
Telangana Schools
Ram Naramaneni
|

Updated on: Sep 02, 2021 | 5:59 PM

Share

తెలంగాణలో పాఠశాలలు తెరిచి 2 రోజులు కాలేదు.. అప్పుడే కరోనా కలవరం మొదలైంది. ఇప్పుడే పిల్లల్ని స్కూల్‌కి పంపించాలా..? వద్దా అని పేరెంట్స్ మదనపడుతోన్న సమయంలో.. విద్యాలయాల్లో నమోదవుతున్న కేసులు గుబులు రేపుతున్నాయి. తాజాగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో పాఠశాలను శానిటైజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్‌ఈఓ(MEO) పాఠశాలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు.

పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

పాఠశాలల్లో ఎక్కువ మంది ఒకేసారి వైరస్  బారిన పడితే ఆ పాఠశాలని క్లష్టర్‌గా గుర్తించి పిల్లలకు, టీచర్స్ కి వెంటనే టెస్టులు చేస్తామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. టెస్టుల్లో ఐదుగురు కంటే ఎక్కువ మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే పాఠశాల స్ట్రెంత్‌ని బట్టి వారం రోజుల పాటు స్కూల్‌ని మూసివేస్తామని చెప్పారు. ఒకే క్లాస్‌లో ఎక్కువ కేసులు నమోదైతే.. ఆ క్లాస్‌లోని స్టూడెంట్స్ అందరినీ ఐసోలేషన్‌కి పంపుతామని వెల్లడించారు. 95% పాఠశాలల స్టాఫ్‌కి వాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మాత్రమే టీచర్లను, స్టాఫ్‌ని పాఠశాలల్లోని అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలో మాస్క్, తరచూ శానిటైజర్ వాడాలని కోరారు. కరోనా వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపారు. పిల్లల్లో విద్యపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొన్నారు. పిల్లలు ఫోన్లకు బానిసలు అవుతున్నారని తెలిపారు. పిల్లల మానసిక స్థితి దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు తెరిచామన్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను స్కూల్‌కు పంపాలని కోరారు. అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్ చేశామని, థర్మల్ స్క్రీనింగ్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

1 నుంచి 10 ఏళ్లలోపు వారిలో కేవలం 3 శాతం మంది కరోనా బారిన పడ్డారని.. 20 ఏళ్లల్లోపు వారిలో 13 శాతం మందికి కొవిడ్ సోకిందని తెలిపారు. పిల్లలకు కరోనా సోకినా 100 శాతం కోలుకుంటున్నారని డీహెచ్‌ శ్రీనివాస రావు చెప్పారు. సీరో సర్వే ప్రకారం పెద్దల్లో 63 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడయిందని తెలిపారు.

Also Read: ఏపీలో కొత్తగా 1,378 కరోనా వ్యాప్తి.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్

Follow Us
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!