Telangana: భద్రాద్రి జిల్లాలో దారుణం.. ఆ కారణం తో 20 కుటుంబాల బహిష్కరణ..

దీంతో ఆగ్ర‌హించిన గ్రామపెద్ద‌లు ఆ 20 కుటుంబాల వారిని పిలిపించారు. కులానికి కట్టుబడకుండా, పెద్దలకు ఎదురు సమాధానం చెప్పారని ఆగ్రహించారు. అందుకు గాను తమను కులం నుండి వెలి వేస్తున్నట్టుగా తీర్పునిచ్చారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేసారు. తమ బంధువులు తమ ఇంటికి వచ్చినా, తాము వారి ఇళ్ళ‌కు వెళ్లినా, మా బంధువులు మాతో మాట్లాడినా రూ.5000 జ‌రిమానా విధించనున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా తమకు కిరాణా, కూర‌గాయ‌లు అమ్మినా రూ.5000 జ‌రిమానా కట్టాలని

Telangana: భద్రాద్రి జిల్లాలో దారుణం.. ఆ కారణం తో 20 కుటుంబాల బహిష్కరణ..
Social Exclusion
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: May 15, 2024 | 9:18 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అశ్వారావుపేట మండలం, వడ్డె రంగాపురం గ్రామంలో 20 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. వారిని వెలివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ దేవతలను కొలిచేందుకు గానూ, అడిగిన చందా ఇవ్వలేదనే కారణంగా కుల పెద్దలను వారిపై బహిష్కరణ వేటు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వ‌డ్డె రంగాపురంలో సుమారు 120 వడ్డెర కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా ఒకే వడ్డెర కులానికి చెందినవారు. అయితే, వ‌డ్డె రంగాపురం గ్రామానికి చెందిన గుంజి ల‌క్ష్మ‌య్య‌, డేరంగుల దుర్గ‌య్య, ప‌ల్ల‌పు అప్పారావు త‌దిత‌రులు గ్రామంలో బొడ్రాయి ప్ర‌తిష్టించాల‌ని తీర్మానించారు. ఇందుకు గానూ ఆగ్రామంలోని 120 కుటుంబాల వారు ఒక్కో కుటుంబానికి రూ.3000 చెల్లించాల‌ని ఆదేశించారు. అదే గ్రామంలోని 20కుటుంబాల‌కు చెందిన వారంతా ఇందుకు ఒప్పుకోలేదు. తామంతా క్రైస్తవ మతం స్వీకరించామని, అందువల్ల తాము చందా ఇవ్వ‌లేమని చెప్పారు. అలా చేస్తే తమ విశ్వాశానికి వ్య‌తిరేక‌మ‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు. ఇటువంటి గ్రామ దేవతల పూజలు వంటి వాటికి తామంతా వ్య‌తిరేక‌మ‌ని చెప్పారు.

దీంతో ఆగ్ర‌హించిన గ్రామపెద్ద‌లు ఆ 20 కుటుంబాల వారిని పిలిపించారు. కులానికి కట్టుబడకుండా, పెద్దలకు ఎదురు సమాధానం చెప్పారని ఆగ్రహించారు. అందుకు గాను తమను కులం నుండి వెలి వేస్తున్నట్టుగా తీర్పునిచ్చారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేసారు. తమ బంధువులు తమ ఇంటికి వచ్చినా, తాము వారి ఇళ్ళ‌కు వెళ్లినా, మా బంధువులు మాతో మాట్లాడినా రూ.5000 జ‌రిమానా విధించనున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా తమకు కిరాణా, కూర‌గాయ‌లు అమ్మినా రూ.5000 జ‌రిమానా కట్టాలని కుల పెద్దలు తీర్మానం చేసారని వాపోయారు. చ‌ర్చిలో ప్రార్థ‌న‌లు కూడా చేయ‌డానికి వీళ్లేద‌ని హెచ్చ‌రించారంటూ బాధితులు ఆరోపించారు. దీంతో తామంతా చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇన్ని రోజులు భరించామని, ఇక ఈ విషయాన్ని పోలీసులు, అధికారుల దృష్ఠికి తీసుకువెళ్తామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను పరిష్కరించాలని బాధిత 20 కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!