AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్ల కొడును గొంతునులిమి చంపిన తల్లి..! కారణం తెలిసి ఖాకీలే షాక్‌..?

స్థానికులతో కలిసి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. కానీ, బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. కుమారుడి మెడపై గాయాల గుర్తులను చూశానని, తన కొడుకును హత్య చేసినట్లు ఆరోపించాడు. దీంతో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. దాంతో సదరు మహిళ తన నేరాన్ని అంగీకరించింది.

8 ఏళ్ల కొడును గొంతునులిమి చంపిన తల్లి..! కారణం తెలిసి ఖాకీలే షాక్‌..?
Gurugram Police
Jyothi Gadda
|

Updated on: May 15, 2024 | 8:19 PM

Share

కన్న తల్లే కాల యముడిగా మారింది. 8 ఏళ్ల కుమారుడిని గొంతునులిమి చంపేసిందో రాక్షస తల్లి. అనంతరం బాలుడు అనారోగ్యంతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, తల్లి ప్రవర్తలో తేడాను గమనించిన పోలీసులు..ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. తల్లే ఆ బాలుడ్ని హత్య చేసినట్లు విచారణలో తేలింది. వివాహేతర సంబంధం కారణంగానే ఆమె బాలుడిని హతమార్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి చెందిన దంపతులైన అరవింద్ కుమార్, పూనమ్ దేవి, సిర్‌హౌల్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 8 ఏళ్ల కుమారుడు అనారోగ్యంతో చనిపోయినట్లు 28 ఏళ్ల పూనమ్‌ దేవి ఏడ్చింది. దీంతో ఇరుగు పొరుగు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. స్థానికులతో కలిసి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. కానీ, బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. కుమారుడి మెడపై గాయాల గుర్తులను చూశానని, తన కొడుకును హత్య చేసినట్లు ఆరోపించాడు. దీంతో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. దాంతో సదరు మహిళ తన నేరాన్ని అంగీకరించింది.

అరవింద్‌ కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం సెక్టార్ 18 పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని హత్య చేసినట్టుగా  ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, విచారణలో, పోలీసులకు మృతి చెందిన బాలుడి తల్లిపై అనుమానం వచ్చి, ఆ తర్వాత మహిళను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. విచారణ అంనతరం మంగళవారం ఆమెను అరెస్టు చేశారు. అయితే ఈ విషయమై విచారణ జరుపుతున్నామని, మహిళను మరింత లోతుగా విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..