Telangana: పరీక్ష రాసి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణం.. ఈ రోజు అవే పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన వైనం

ఇంటర్ పరీక్ష రాసి వస్తున్న క్రమంలో.. రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థిని మరణించింది. అయితే.. తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మరణించిన ఆ విద్యార్థిని ఇంటర్ టాపర్‌గా నిలించింది.

Telangana: పరీక్ష రాసి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణం.. ఈ రోజు అవే పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన వైనం
Rajeshwari
Follow us

|

Updated on: Jun 29, 2022 | 1:01 PM

Inter Topper Rajeshwari: ఆ విద్యార్థిని ఎన్నో కలలు కన్నది.. కష్టపడి చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కానీ విధి ఆడిన వింత నాటకంలో ప్రాణాలు కోల్పోయింది. ఇంటర్ పరీక్ష రాసి వస్తున్న క్రమంలో.. రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థిని మరణించింది. అయితే.. తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మరణించిన ఆ విద్యార్థిని ఇంటర్ టాపర్‌గా నిలించింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన నల్లన్న కుమార్తె రాజేశ్వరి (18) జిల్లా కేంద్రంలోని గొనుపాడు కేజీబీవీలో ఇంటర్‌ చదివింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మే 19న తండ్రి నల్లన్న (42) కుమార్తె రాజేశ్వరిని బైక్‌పై ఎక్కించుకుని గద్వాల నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు.

కాగా, మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాజేశ్వరి ఎంపీసీలో 867 మార్కులు సాధించి జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో టాపర్‌గా నిలిచింది. ఇంటర్‌లో రాజేశ్వరి ప్రతిభను గుర్తు చేసుకుని కుటుంబసభ్యులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజేశ్వరి బతికుంటే ఎంతో సంబరపడిపోయేదని.. రాజేశ్వరి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆమె తల్లి పద్మమ్మ విషాదంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి
Inter Memo

Inter Memo

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..