Bhatat Jodo Yatra: తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ.. పూర్తి వివరాలివే

తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర సాగేలా పాదయాత్ర రూట్ మ్యాప్‌ను డిజైన్ చేశారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు.

Bhatat Jodo Yatra: తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ.. పూర్తి వివరాలివే
Rahul Gandhi
Follow us

|

Updated on: Oct 13, 2022 | 9:22 PM

తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తోన్న ఆయన ఈ నెల 23న తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర సాగేలా పాదయాత్ర రూట్ మ్యాప్‌ను డిజైన్ చేశారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మీదుగా మద్నూర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. రూట్‌ మ్యాప్‌ ప్రకారం మక్తల్, దేవరకద్ర, మహాబూబ్ నగర్ టౌన్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మోజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయినపల్లి గాంధీ ఐడీయాలజీ సెంటర్, బాలానగర్, మూసాపేట్ జంక్షన్ , కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరువు, ఓటర్ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరం పేట్, మద్దునూర్‌ల మీదగా ఈ పాదయాత్ర సాగనుంది.

గ్రాండ్ సక్సెస్‌ చేయాలి..

కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్ రాహుల్ గాంధీ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మనకు అత్యంత కీలకం. భారత్ జోడో యాత్ర గురించి పంచాయతీలలో వాల్ రైటింగ్స్ చేయించాలి. ప్రచారం, పోస్టర్లు గ్రామ గ్రామాన చేపట్టాలి. ప్రజలను ఐక్యం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. ప్రతి రెండు కిలో మీటర్ల ఒక నాయకుడు బాధ్యత తీసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.

ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ’23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది. కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించాం. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుంది. ఇందిరాగాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహిస్తాం. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు