Telangana SSC Exams 2023: తెలంగాణ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! ఈ సారి కూడా 6 పేపర్లే..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Nov 01, 2022 | 6:14 PM

గత విద్యా సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలను ఆరు పేపర్ల తోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు..

Telangana SSC Exams 2023: తెలంగాణ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! ఈ సారి కూడా 6 పేపర్లే..
Telangana

గత విద్యా సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలను ఆరు పేపర్ల తోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. గతేడాది పది పబ్లిక్‌ పరీక్షల్లో 11 పేపర్లను 6కు కుదించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఏడది కూడా పదో తరగతి పరీక్ష 2023ను ఆరు పేపర్లకే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

కాగా 2021లో కరోనా మహమ్మారి కారణంగా 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఏడాది కోవిడ్ ఉద్ధృతి కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో పదో తరగతి విద్యార్ధులందరినీ ఆల్ పాస్‌ అని ప్రకటించింది. ఇక 2022లో 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు 2023లోనూ ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రతి ఏడాది ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది నవంబర్ 1 నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఈ కింది తేదీల్లో జరగనున్నాయి. టైం టేబుల్ ఈ కింద చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

Whatsapp Image 2022 10 13 At 20.40.15

Whatsapp Image 2022 10 13 At 20.40.15

Whatsapp Image 2022 10 13 At 20.40.15 (1)

Whatsapp Image 2022 10 13 At 20.40.15 (1)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu