పనికి రావడం లేదని 12 ఏళ్ల బాలుడిని చావగొట్టిన యజమాని
నిజామాబాద్ జిల్లా మాల్కాపూర్ (ఏ) దారుణ సంఘటన చోటు చేసుకుంది. 12 సంవత్సరాల బాలుడు పనికి రావటం లేదని రాక్షసంగా ప్రవర్తించాడు యజమాని బాలయ్య. 12 ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకోవడమే కాకుండా, అందరూ చూస్తుండగానే కాళ్లకు తాడు కట్టేసి..
నిజామాబాద్ జిల్లా మాల్కాపూర్ (ఏ) దారుణ సంఘటన చోటు చేసుకుంది. 12 సంవత్సరాల బాలుడు పనికి రావటం లేదని రాక్షసంగా ప్రవర్తించాడు యజమాని బాలయ్య. 12 ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకోవడమే కాకుండా, అందరూ చూస్తుండగానే కాళ్లకు తాడు కట్టేసి బాలుడిని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. కొట్టవద్దని ప్రాధేయపడినా.. ఆ బాలున్ని చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఇంత జరుగుతున్నా అక్కడి స్థానికులు ఎవరూ ఆ యజమానికి ఆపేందుకు ప్రయత్నించక పోగా, చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కాగా మైనర్ బాలుడిపై దాడి ఘటనపై మల్కాపూర్ గ్రామీణాభివృద్ధి కమిటీ స్పందించింది. ఈ అమానుష దాడి ఘటనను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Read More:
కరోనా నుంచి కోలుకున్న డైరెక్టర్ రాజమౌళి కుటుంబం
దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు, కర్నాటకకి ఎల్లో అలెర్ట్