కరోనాతో మరణించిన మాజీ ఎమ్మెల్యే మనవళ్లు
కరోనా వైరస్తో మాజీ ఎమ్మెల్యే మనవళ్లు మృతి చెందారు. 20 రోజుల వ్యవధిలోనే కోవిడ్తో ఇద్దరూ కన్నుమూశారు. ఈ విషాద ఘటన గుంటూరు దాచేపల్లి మండలం ముత్యాలపాడులో చోటు చేసుకుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనవళ్లు..
కరోనా వైరస్తో మాజీ ఎమ్మెల్యే మనవళ్లు మృతి చెందారు. 20 రోజుల వ్యవధిలోనే కోవిడ్తో ఇద్దరూ కన్నుమూశారు. ఈ విషాద ఘటన గుంటూరు దాచేపల్లి మండలం ముత్యాలపాడులో చోటు చేసుకుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనవళ్లు కొత్త నరేష్(35), కొత్త రామకృష్ణ (32) కరోనా మహమ్మారికి బలయ్యారు. కొత్తవెంకేటశ్వర్లు కుమారుడు కోటేవ్వర్ రావుకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు నరేష్ పిడుగురాళ్లలో బిజినెస్ చేస్తుండగా, చిన్న కొడుకు రామకృష్ణ వైసీపీలో క్రీయాశీలకంగా పని చేస్తున్నాడు.
కాగా గత నెలలో నరేష్ అనారోగ్యానికి గురవ్వగా.. పరీక్షలు చేయించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నరేష్ హోమ్ క్వారంటైన్లో ఉండగా.. తమ్ముడు రామ కృష్ణ సేవలు చేసేవాడు. ఈ క్రమంలో నరేష్ గత నెల 21న మరణించాడు. అనంతరం రామకృష్ణ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇక వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూ రామకృష్ణ మృతి చెందాడు. ఒకే కుటుటంబంలో ఇద్దరు కుమారులు పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా రామకృష్ణ మృతి పట్ల గురజాల శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని అని పేర్కొన్నారు.
Read More:
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడి ఆరోగ్యం విషమం